రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో అమరావతిలో పలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఏర్పాటు చేయబోయే క్వాంటర్ కంప్యూటర్ రెడీ అయ్యిందని తెలిపారు. దాన్ని అమరావతికి తీసుకురావడమే మిగిలి ఉంది అన్నారు. ముందుగా తీసుకువస్తామని మరోసారి చంద్రబాబు నాయడు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ముచ్చటించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడ్డంకులను దాటుకుని.. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్‌ని అమరావతికి తీసుకొస్తామని తెలిపారు. దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అనే దాని గురించి త్వరలో ప్రకటన చేస్తామన్నారు. అలానే నంబర్ 1, 15వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. దీని గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘త్వరలోనే విశాఖ వేదికగా నిర్వహించబోయో సీఐఐ భాగస్వామ్య సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. దీనిలో భాగంగా ప్రజెంటేషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిక్యూషన్, ఎంవోయూలు ఇలా ప్రతిదీ పకడ్బందీగా జరుగుతాయి. ఈ సదస్సులో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్‌ ఎనర్జీ, ఏఐ సహా అత్యాధునిక సాంకేతిక అంశాలపై చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను సదస్సుకు ఆహ్వానించారు అని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ మాదిరే అమరావతి బ్రాండ్‌హైదరాబాద్‌ తరహాలోనే ఏపీ రాజధాని అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా పెరుగుతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజికల్‌ నైట్, దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సారధ్యంలో మ్యూజికల్‌ నైట్‌, విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేక గుర్తింపును తెస్తున్నాయి అని తెలిపారు. అలానే తెలంగాణకు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌.. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం చాలా మంచి పరిణామం అన్నారు. అలానే త్వరలోనే రాష్ట్రంలోని 22ఏ భూములకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని చంద్రబాబు నాయుడు తెలిపారు.