తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని రోడ్లు, భవనాల శాఖ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.60 వేల కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతుండగా.. మరో రూ.28 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉండగా.. దీన్ని నాలుగు వరుసల నుంచి 8 వరుసలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు రూ.10 వేల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ఈ విస్తరణ పనులు రాష్ట్రంలో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయన్నారు. ఇదే కాకండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఏపీలోని బందరు పోర్ట్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ఏపీని తెలంగాణను కనెక్ట్ చేస్తూ.. మన్ననూరు-శ్రీశైలం హైవే పనుల ప్రతిపాదనలు కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సమగ్ర రవాణా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్ఆర్‌ఆర్‌ను ఏకంగా ఆరు వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు.. ఇందుకు రూ.36 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న హ్యామ్ (HAM) రోడ్ల కోసం త్వరలో రూ.11,399 కోట్ల విలువైన టెండర్లు పిలవనున్నట్లు మంత్రి వివరించారు.రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచే కీలక ఘట్టాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) సదస్సును నిర్వహించడానికి కేంద్రం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకోసం అనుమతులు తెలిపిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరిగే ఈ సదస్సు తెలంగాణ రహదారుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల పురోగతికి గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఆర్‌సీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేపడుతుందని ఆయన తెలిపారు.మౌలిక సదుపాయాల కల్పన విషయంలో చూపిస్తున్న ఈ చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో బహుళజాతి సంస్థలకు కేంద్రంగా మారనుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరుకు అనుమతులు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.