ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో రూ.10వేలు, రూ.5వేలు జమ.. ప్రతి నెలా ఇస్తారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనాల కోసం నిధులు విడుదల చేసింది. రూ.90 కోట్లు విడుదల చేస్తూ మైనారిటీ సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు చొప్పున వేతనాలు అందిస్తారు. గతేడాది ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పాటు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న బకాయిలను ఈ నిధులతో చెల్లిస్తారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా పెండింగ్‌ బిల్లులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.సందర్భంగా ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ప్రకటించిన 24 గంటల్లోనే ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఈ నిర్ణయంపై మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. గౌరవ వేతనాల చెల్లింపునకు రూ.90 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నిర్ణయంపై మంత్రి ఫరూక్ సంతోషం వ్యక్తం చేశారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జీవో విడుదల చేసినందుకు మంత్రి ఫరూక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.పెండింగ్‌ నిధులపై మంత్రి నారాయణ రిక్వెస్ట్అమృత్‌ పథకం, 15వ ఆర్థిక సంఘం పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆర్థికశాఖ మంత్రిని దిల్లీలో బుధవారం కలిసిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావలసిన నిధులు, కేటాయింపులు, విడుదలపై చర్చించారు. విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, సంచాలకులు సంపత్‌కుమార్, ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం ఈఎన్‌సీ ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా సివిల్స్‌ శిక్షణఏపీ ప్రభుత్వం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం 340 మంది అభ్యర్థులకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా శిక్షణకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 33 శాతం సీట్లను రిజర్వ్ చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అభ్యర్థులు apstudycircle.apcfss.in అనే వెబ్‌సైట్‌ను చూడాలని సామాజిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. విద్యుత్తు సంస్థల రుణాలకు ప్రభుత్వం హామీఏపీ ప్రభుత్వం, ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీఎఫ్‌సీఎల్‌) ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు నుండి రూ.1,000 కోట్ల రుణం తీసుకోవడానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, రాష్ట్ర డిస్కంలు వివిధ బ్యాంకుల నుండి తీసుకోబోయే రూ.1,150 కోట్ల రుణాలకు కూడా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ ఆర్థిక సహాయం ద్వారా ఏపీపీఎఫ్‌సీఎల్‌ తన కార్యకలాపాలను మరింత మెరుగుపరుచుకోనుంది.