తెలంగాణలో మరో కొత్త పథకం.. వారందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం

Wait 5 sec.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పేరుతో సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఆ వివరాలు.. తెలంగాణలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం బాల భరోసా పథకాన్ని అమలు చేయబోతుంది. ఇంతకు ఇది దేని కంటే చిన్నారులకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు బాల భరోసా పథకం ద్వారా మెరుగైన వైద్యం ఉచితంగా అందించనున్నారు. దీని కోసం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది సర్వే నిర్వహించి.. పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 8 లక్షల మంది చిన్నారులను గుర్తించింది. వీరిలో కొందరు రక్తహీనతతో బాధపడుతుండగా.. మరి కొందరు వినికిడి, చూపు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు చిన్నారులు వయసుకు తగిన ఎదుగల లేక పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ఈ చిన్నారులందరికీ బాల భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది. దీని ద్వారా వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడం.. వినికిడి లోపం ఉన్న వారికి మెషీన్లు అమర్చడంతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందిస్తారు. మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా బాల భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నాయి. అలానే దీన్ని ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయనున్నారు. అందువల్ల బాల భరోసా వర్తించని అనారోగ్య సమస్యలు, వ్యాధులుంటే.. వాటి చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చెల్లించేలా ప్రణాళికలు రెడి చేస్తున్నారు. అలానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్‌బీఎస్‌కే) పథకాన్ని కూడా బాల భరోసాతో అనుసంధానం చేయబోతున్నారు.ఇక ఈ బాల భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి గాను సర్కార్.. కొత్త సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్రను ట్రాక్‌ చేస్తారు. అందుకు తగ్గట్టుగా చికిత్స అందించడమే కాక దాని పురోగతిని పర్యవేక్షిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఈ బాల భరోసా పథకం విజయవంతమైతే.. రాష్ట్రంలోని లక్షల మంది చిన్నారులకు చిన్న వయసులోనే మెరుగైన వైద్య సేవలు అంది... ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది పడుతుంది అంటున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.