విద్యార్థులకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్

Wait 5 sec.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘాల భౌతిక దాడులు, చందాల దందాకు నిరసనగా (గురువారం) బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బంద్‌కు పిలుపు ఇవ్వగా.. కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు మూసివేయనున్నారు. విద్యార్థి సంఘాల చందాల వసూలు నుంచి విద్యా సంస్థలకు విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.బుధవారం హనుమకొండలోని స్మైల్ డీజీ స్కూల్ కరస్పాండెంట్ ఎస్. శ్రీనివాస్ వర్మపై పీడీఎస్‌యూ (PDSU) నాయకులు దాడికి పాల్పడటం ఈ బంద్‌కు ప్రధాన కారణం. పీడీఎస్‌యూ నాయకులు స్కూల్‌ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చందాల కోసం వచ్చి తమపై దాడి చేశారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్‌ స్కూల్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ సీసీ ఫుటేజీ ఆధారంగా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మ హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పీడీఎస్‌యూ నాయకులపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ భౌతిక దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాదాద్ జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసన బంద్‌కు పీఎస్‌టీ (PST), టీపీజేఎమ్‌ఏ (TPJMA), కేయూపీఎమ్‌ఏ (KUPMA) వంటి ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. బంద్‌లో భాగంగా స్కూల్‌ కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు గురువారం ఉదయం 10 గంటలకు హనుమకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద సమావేశమై భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులను కలిసి వినతి పత్రం సమర్పిస్తారు. భవిష్యత్తులో ప్రైవేటు విద్యా సంస్థలపై, యాజమాన్యాలపై ఇలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనున్నారు.