ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి శనివారం (నవంబర్ 15) వరకు రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. సీఐఐ సదస్సు నేపథ్యంలో విశాఖ సాగరతీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనాలు ఉన్నాయి. గవర్నర్‌తో పాటు ఉప రాష్ట్రపతి కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సదస్సులో భాగంగా భాగంగా మూడు రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరిక లేకుండా పనిచేయనున్నారు. సీసీఐతో కలిసి ఏపీ నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు షెడ్యూల్ ఇదే. నవంబర్ 13 (గురువారం) విశాఖలోని హోటల్ నోవోటెల్‌లో ఉదయం.. 'పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్-ఇండియా- యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్' అనే అంశంపై బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, తైవాన్.. ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం పవన్, రెన్యూఎస్పీపీ పంప్స్‌ లిమిటెడ్, మురుగప్ప గ్రూప్, బాలాజీ యాక్టన్‌ బిల్డ్‌వెల్, హీరో ఫ్యూచర్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతారు. ఇక సాయంత్రం విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. సీఐఐ మండలి ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. నవంబర్ 14 (శుక్రవారం)సీఐఐ సదస్సు ప్రారంభం తర్వాత.. ‘టెక్నాలజీ, ట్రస్ట్‌ అండ్‌ ట్రేడ్‌’ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ‘ఏఐ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత సింగపూర్‌ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక సాయంత్రం ఏపీలో ఆర్థికశాఖ నిర్వహించే 'రీ ఇమేజినింగ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ సమిట్‌'లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌తో సమావేశంలో.. వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైజాగ్‌లో లూలూ గ్రూప్ నిర్మించే మాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నవంబర్ 15 (శవారం)రెండో రోజు ఉదయం బ్లూమ్‌బర్గ్‌ మీడియా సమావేశం జరిగుతుంది. అందులో సీఎం పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడతారు. ఆ తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్‌ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జపాన్, కెనడా, న్యూజిలాండ్, బహ్రెయిన్, ప్రతినిధులతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహించే.. 'సెంటర్‌ ఫర్‌ ఫ్రాంటియర్‌ టెక్నాలజీస్‌'ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాతకు శంకుస్థాపన చేయనున్నారు. మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాల ప్రోగ్రాం ఉంటుంది. సీఐఐ సదస్సు చివరగా నిర్వహించే మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. ఈ సమిట్‌లో చేసుకున్న ఒప్పందాల వివరాలను వెల్లడిస్తారు. అమరావతిలో రూ. 44 వేల కోట్ల పెట్టుబడులు..సీఐఐ సదస్సులో అమరావతికి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూ. 44,600 కోట్ల పెట్టుబడులకు ఈ సదస్సులో అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం. టూరిజం, హెల్త్, మీడియా సిటీ, క్రీడలు, నాలెడ్జ్ సిటీ, రివర్ ఫ్రండ్ వంటి ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 33 ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం.