మహిళకు పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తూరు జిల్లాలో చేసిన పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలమనేరు మండలంలోని ముసలిమడుగు నవంబర్ 9న పవన్ కళ్యాణ్ సందర్శించారు. అయితే . గాయంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న హేమావతి కోసం తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రత్యేక కానుకను పంపించారు. ఘటన గురించి తెలుసుకుని మంగళగిరి నుంచి ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మలను బాధితురాలికి పంపించారు. జరిగిన ఘటనకు చింతిస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. ఓ లేఖను కూడా పంపారు. దీన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఆ మహిళకు అందించారు.ఎప్పటికీ రుణపడి ఉంటాం సర్..పవన్ కళ్యాణ్ బహుమతి పంపించడంపై హేమావతి సంతోషం వ్యక్తం చేసింది. "పవన్ కళ్యాణ్ సర్‌కు నమస్కారం. మొన్న జరిగిన తోపులాటలో నాకు అయిన చిన్న గాయాన్ని మరిచిపోకుండా గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు. జిల్లా జనసేన నేతలను పంపించి పరామర్శించారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ కానుక పంపించినందుకు.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సర్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇల్లు లేదు, ఫించన్ లేదు.. ఈ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నా" అని హేమావతి చెప్పింది. కాగా, నవంబర్ 9న జరిగిన ఘటనపై జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం సందర్శనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన్ను చూడటానికి వేల మంది అక్కడకు వచ్చారని తెలిపారు. ఆయన కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న సమయంలో హేమావతి అనే మహిళకు చిన్న గాయం అయిందన్నారు. అయితే దాన్ని.. పని పాట లేని వైసీపీ వారు సోషల్ మీడియాలో.. పెద్ద ప్రమాదంగా చిత్రీకరించారన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ పట్టించుకోకుండా.. తనకు కాల్ చేసి బాధితురాలి గురించి తెలుసుకున్నారన్నారు హరిప్రసాద్. జనసేన నాయకులంతా వెళ్లి పరామర్శించి.. డాక్టర్లతో మాట్లాడారని, కాలుకి ఫ్రాక్చర్ కాలేదని తెలుసుకున్నారని చెప్పినా.. జిల్లా అధ్యక్షులుగా తనను స్వయంగా వెళ్లి పరామర్శించాలని ఆదేశించినట్లు హరిప్రసాద్ తెలిపారు. కాగా, బాధితురాలికి రూ. 10 వేల ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడా సరకులు ఇవ్వనున్నట్లు చెప్పారు. మానవత్వం మరిచి..మహిళ కాలిపై నుంచి పవన్ కళ్యాణ్ కారు దూసుకెళ్లిందని వైసీపీ నేతలు ఆరోపించారు. మానవత్వం మరిచిన పవన్.. పట్టించుకోకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను జనసేన ఖండించింది. ఎక్కువ సంఖ్యలో జనం రావడం వల్ల.. తోపులాట కారణంగా మహిళకు చిన్న గాయమే అయిందని వెల్లడించింది.