జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో భాగంగా అధికారులు ఎన్నికల నిఘా కోసం . అయితే నిఘా కోసం ఎగరేసిన ఈ డ్రోన్లను కొందరు గాలిపటాల సాయంతో కూల్చివేశారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పోలింగ్ బూత్‌ల పరిసరాల్లో నిఘా పెట్టడం కోసం మొదటిసారి డ్రోన్లను ఉపయోగించగా.. కొందరు మాత్రం తెలివిగా గాలిపటాలు ఎగరేయడం ద్వారా వాటిని కూల్చేశారు. డ్రోన్ల నిఘాను గాలిపటాలతో అడ్డుకోవడానికి ప్రయత్నించడం.. ఎన్నికల సంఘం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు.ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎలక్షన్ కమిషన్ డ్రోన్లను రంగంలోకి దించిది. ఎలక్షన్ కమిషన్ డ్రోన్లను రంగంలోకి దించింది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. తమిళనాడు నుంచి మొత్తం 139 మంది లైసెన్స్డ్ డ్రోన్ పైలట్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. డ్రోన్ల పర్యవేక్షణ కోసం వచ్చిన ప్రతి పైలట్‌కు రూ. 12,000 గౌరవ వేతనం ఇచ్చి మరీ వారి సేవలను ఉపయోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ల చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో నిఘా పర్యవేక్షణ బాధ్యతను వారికి అప్పగించారు. ఈ డ్రోన్లు మూడు గంటల పాటు పనిచేసేలా.. మూడు బ్యాటరీలతో వచ్చాయి. వీటిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానించారు. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాల నుంచి లైవ్ ఫీడ్ అక్కడికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అయితే, డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలో ఆరు డ్రోన్లను కొందరు కూల్చేశారు. రహమత్‌నగర్, కార్మికనగర్ ప్రాంతాల్లో రెండేసి చొప్పున, మధురానగర్, షేక్‌పేట ప్రాంతాల్లో ఒక్కో డ్రోన్‌ను గాలిపటాలతో కూల్చివేశారు. దీంతో ఈ ఆపరేషన్ గందరగోళంగా మారింది. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 2.5 లక్షలు. అవి గాలిలో ఉండగానే పనిచేయడం ఆగిపోవడంతో పోలీసులు వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.దీని గురించి ఓ అధికారి మాట్లాడుతూ... కొన్ని అవాంతరాలు మినహాయిస్తే.. చాలా వరకు డ్రోన్ల ద్వారా లైవ్ కవరేజీని కొనసాగించగలిగామని అన్నారు. డ్రోన్‌ల ద్వారా వచ్చిన 1,000 గంటలకు పైగా వీడియో ఫుటేజీని కంట్రోల్ రూమ్‌లోని అధికారులు పర్యవేక్షించారు. దీని ఆధారంగా ఫీల్డ్ ఆపరేటర్లకు అప్పటికప్పుడు పలు సూచనలు ఇవ్వగలిగారు. గాలిపటాలతో కొన్ని డ్రోన్లను కూల్చివేయడంతోపాటు.. కొన్ని ప్రాంతాల్లో ఆగంతకులు.. పైలట్ల వద్ద నుంచి డ్రోన్లను లాక్కోవడానికి ప్రయత్నించారు.. ఆపరేటర్లను కూడా బెదిరించారని సమాచారం. డ్రోన్ల కూల్చివేతలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. డ్రోన్లను కూల్చిన వ్యక్తులను గుర్తించడానికి.. అలానే ఆయా ప్రాంతాల్లో ఏవైనా ఉల్లంఘనలు జరిగాయో లేదో తెలుసుకోవడం కోసం వీడియో ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. అయితే చాలా మంది మహిళా డ్రోన్ పైలెట్లు ఈ విధులకు దరఖాస్తు చేసుకోగా... ఎక్కువగా పురుషులకే ఈ అవకాశం లభించింది. డ్రోన్ల కూల్చివేతపై ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ డ్రోన్ల వినియోగం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని భావించాము. కానీ వాటిని కూల్చివేయడం నిజంగా విచారకరం. ఏది ఏమైనా డ్రోన్ల వినియోగంతో జూబ్లీహిల్స్ బైపోల్ దేశ ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది’’ అన్నారు.