రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెట్టపీట వేస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో అన్ని వనరులూ ఉన్నాయని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ భారత్ ఫోర్జ్ ఆసక్తి కనబరిచింది. ఈ మేరకు బుధవారం రాత్రి విశాఖలోని హోటల్ నోవోటెల్‌లో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి.. ముఖ్యంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తమ సంస్థ తరఫున పరిశ్రమల ఏర్పాటు గురించి సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న పారిశ్రామిక విధానాలను, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు.. భారత్ ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌కు వివరించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు.. ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో.. నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అడ్వాన్స్‌డ్‌ ఉత్పత్తుల తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు అమిత్‌ కల్యాణి ఆసక్తి వ్యక్తం చేశారు. ఇక తిరుపతి సమీపంలో అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్‌ సెన్సర్ల ఉత్పత్తి కోసం పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేశారు. టెక్నాలజీతో పాటు పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమిత్ కళ్యాణి తెలిపారు. అందులో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రదేశం.. గండికోట వద్ద రివర్‌ క్రూజ్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి తెలియజేశారు. కాగా, ఏపీలో భారత్‌ ఫోర్జ్‌ సంస్థ చేపట్టే ప్రాజెక్టులకు.. తమ ప్రభుత్వం పూర్తిగా సహకకారం అందిస్తుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. నౌకా నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సరైన ప్రాతం అని.. తీర ప్రాంతం వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందన్నారు. ఇక పర్యాటక రంగంలో కూడా రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గండికోటతో పాటు ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన పాపికొండలు, అరకు వ్యాలీ కూడా కొత్త ప్రాజెక్టులకు అనువైన ప్రదేశాలన్నారు. ఈ సందర్భంగా అమిత్ కళ్యాణికి తెలియజేశారు. తనకు తానే గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ ఎదిగిందని తెలిపారు. సమావేశం తర్వాత అమిత్ కళ్యాణిని సీఎం చంద్రబాబు సత్కరించి.. ఆరకు కాఫీని కానుకగా ఇచ్చారు. జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సు నేపథ్యంలో బుధవారం రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన మొదటి భేటీలో భారత్ ఫోర్జ్‌తో వైస్ చైర్మన్‌తో సమావేశమయ్యారు. సీఐఐ సదస్సులో ప్రభుత్వం, భారత్ ఫోర్జ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.