స్టాక్స్‌లో ఎల్ఐసీ రూ. 16 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు.. ఈ బ్యాంకుల్లో కోట్లల్లో షేర్లు!

Wait 5 sec.

: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.. .. ప్రముఖ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఇది వివిధ స్టాక్స్‌లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతుంటుంది. మొత్తంగా రూ. 16 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడులు ఉన్నాయి. గతంలో అదానీ గ్రూప్ స్టాక్స్‌ భారీగా పడిపోయినప్పుడు.. ఎల్ఐసీ ఇందులో ఎక్కువగా పెట్టుబడులు పెట్టిందని.. నష్టాలు వచ్చాయని వాదనలు వచ్చాయి. ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెట్టుబడుల గురించి ఎల్ఐసీ స్పందించింది. ఇందులో ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదని.. తామే స్వతంత్రంగా పెట్టుబడులు పెడతామని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రతి త్రైమాసికంలోనూ తన పోర్ట్‌ఫోలియోను మారుస్తూనే ఉంటుంది. కొత్తగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెంచడం లేదా తగ్గించడం లేదా.. పూర్తిగా వైదొలగడం వంటివి బోర్డు నిర్ణయాల్ని బట్టి జరుగుతుంటాయి.జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో.. ఎల్ఐసీ దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో తన వాటా గణనీయంగా తగ్గించుకుంది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సమారు రూ. 3,203 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 2461 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకులో రూ. 2,032 కోట్ల విలువైన షేర్లను అమ్మేసింది. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం చూస్తే.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే ఇదే క్రమంలో ఎల్ఐసీ తాను విక్రయించిన మొత్తాన్ని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పెట్టుబడి పెట్టింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ.. ఎస్బీఐలో సుమారు రూ. 5,285 కోట్ల విలువైన 6.41 కోట్లకుపైగా షేర్లను కొనుగోలు చేసింది. ఇక యెస్ బ్యాంకులో తన వాటా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఒక శాతం కంటే తక్కువగా ఉండగా.. ఇప్పుడు దానిని 4 శాతానికి పెంచింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇతర దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII).. యెస్ బ్యాంకు నుంచి వైదొలుగుతున్న క్రమంలో ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకులు భవిష్యత్తులో విలీనం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో.. ఇటు అవకాశాలు పెరుగుతాయని పెట్టుబడుల్ని పెంచుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఎల్ఐసీ వ్యూహం విభిన్నంగా ఉంది. స్థిరంగా ఉంటున్న షేర్లలో లాభాల్ని స్వీకరించింది. సగటు కొనుగోలు ధర స్వల్పంగా తగ్గినటువంటి షేర్లలో వాటాల్ని పెంచుకుంది. ఎల్ఐసీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్‌వైపు మొగ్గుచూపుతుండగా.. విదేశీ పెట్టుబడిదారులు మాత్రం ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్‌పైనే ఆసక్తి చూపుతున్నారు.