విశాఖపట్నంలోని ఆంధ్రయ యూనివర్శిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసి సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. శుక్రవారం, శనివారం ఈ సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు హాజరైన ప్రముఖులు, అతిథులకు అదిరిపోయే ఆంధ్రా వంటకాలతో విందు ఇచ్చారు. కోసం దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులను అచ్చమైన ఆంధ్రా రుచుల ఘుమఘుమలు ఆకట్టుకున్నాయి. విశాఖ సదస్సులో దాదాపు 3 వేల మందికి 20 రకాలకు పైగా వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రా రుచులు బావున్నాయంటూ పలువురు కితాబిచ్చారు.లో భాగంగా ఏయూ గ్రౌండ్‌లో ప్రత్యేక హాల్‌‌లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు వేర్వేరు చోట్ల భోజన ఏర్పాట్లు చేశారు. అందరికీ ఒకే రకమైన మెనూను పాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మెనూలో సలాడ్స్‌తో ప్రారంభించి.. మెయిన్ వంటకాలలో గుంటూరు మిరపకాయ కోడికూర, గ్రిల్డ్‌ ఫిష్, పులిహోర, దద్దోజనం, అరికెల కిచిడి, హైదరాబాదీ మటన్‌ థమ్‌ బిర్యానీ, పులావ్ వంటివి అందించారు. అంతేకాదు రోటీ, నాన్స్, స్టీమ్డ్‌ రైస్‌తో పాటు గుత్తి వంకాయ, ఆవకాయ పప్పు, సాంబారు, రసం, దాల్‌ తడకా, పెరుగు ఉన్నాయి. అలాగే ఉలవచారు, గోంగూర ఉల్లి పచ్చడి, మజ్జిగ పులుసు, బీరకాయ, టమాటా రోటి పచ్చడి, పప్పులపొడి-నెయ్యి, అప్పడాలు, మామిడికాయ పచ్చడి వంటివి కూడా మెనూలో ఉన్నాయి. విదేశీ ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేశారు. ఆ మెనూలో ఆంధ్ర సంప్రదాయ వంటకాలను చేర్చారు. గతంలో జరిగిన పెట్టుబడి సదస్సులో జరిగిన సంఘటనల దృష్టా ఈసారి యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి యంత్రాంగం ప్రతి విషయంలోనూ అప్రమత్తతతో వ్యవహరించింది. ప్రత్యేకంగా విదేశీ ప్రతినిధుల కోసం లైవ్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. డెజర్ట్‌ల విభాగంలో ఫ్రూట్ సలాడ్‌తో పాటు నాలుగు రకాల ఐస్‌క్రీమ్‌లను రుచి చూసేందుకు అందుబాటులో ఉంచారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం "ఆంధ్ర డెజర్ట్ కౌంటర్". ఇక్కడ అరిసెలు, పూతరేకులు, కాకినాడ కాజా, సున్నుండలు, పప్పుండలు వంటి సాంప్రదాయ ఆంధ్ర స్వీట్లు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఆశ్చర్యకరంగా చాలా మంది విదేశీయులు ఐస్‌క్రీమ్‌ల కంటే ఈ ఆంధ్ర డెజర్ట్‌లనే ఎక్కువగా రుచి చూశారు. ఈ భోజనాల ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్‌ అశోక్‌ పర్యవేక్షించారు. డీసీఎస్‌ఓ భాస్కర్‌రావు, ఇతర అధికారులు కూడా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ, కాఫీలను అందుబాటులో ఉంచారు.