IPL 2026 రిటెన్షన్, మినీ వేలం ఎప్పుడు, ఎక్కడ? ట్రేడ్ విండోలో మార్పులు అన్నీ ఫుల్ డీటెయిల్స్ ఇవిగో! బడాబడా ప్లేయర్లంతా బయటకే?

Wait 5 sec.

ఐపీఎల్ 2025 మెగా వేలం కంటే ఐపీఎల్ 2026 మినీ వేలమే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా అసలు జరుగుతుందా? లేదా? లేక ఆఖర్లో ట్విస్ట్ ఇస్తూ ఆగిపోతుందా? అన్న టెన్షన్‌లో ఐపీఎల్ ఫ్యాన్స్ ఉండిపోయారు. తేదీ, మినీ వేలం ఎప్పుడు జరుగుతుంది? రిటెన్షన్ లిస్ట్ తర్వాత కూడా ట్రేడ్ విండోలు మార్పులు చేయొచ్చా? లేదా? అన్న డౌట్స్‌కు ఫుల్ క్లారిటీ ఇదిగో!ఐపీఎల్ 2026 రిటెన్షన్‌కు సంబంధించిన కీలక రోజు వచ్చేసింది. నవంబర్ 15 శనివారం నాటికి అన్ని పది ఐపీఎల్ జట్లు తమ రిటైన్‌ చేసిన, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను అధికారికంగా సమర్పించాల్సి ఉంది. ఈసారి పలు స్టార్ క్రికెటర్ల భవితవ్యం నిర్ణయించనుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రిటెన్షన్ డెడ్‌లైన్‌కు కొద్దిసేపటి ముందు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల నుంచి శార్ధూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూధర్‌ఫోర్డ్‌ను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి ట్రేడ్ చేసుకున్నాయి.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్, రవీంద్ర జడేజాలు భారీ ట్రేడ్‌లో భాగమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి తీసుకునే అవకాశాలు బలంగా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జడేజా సేవలను అందుకునే అవకాశం ఉందని జట్టు వర్గాలు సూచిస్తున్నాయి. గత మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆఱ్) అత్యధికంగా రూ.23.75 కోట్లు వెచ్చించి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను ఈసారి విడుదల చేసే అవకాశం ఉందనే సమాచారం కూడా బయటకు వచ్చింది.రిటెన్షన్ నుంచి వేలం వరకూ ఎలా జరుగుతుందంటే..రిటెన్షన్ ప్రక్రియతో జట్లు తమ స్క్వాడ్‌ను సుస్థిరం చేసుకునే మొదటి దశను ప్రారంభిస్తాయి. అంటే జట్టులో ఎవరిని ఉంచుకోవాలి, ఎవర్ని రిలీజ్ చేయాలనే క్లారిటీ ఇస్తాయి. నవంబర్ 15న ఈ ప్రక్రియ పూర్తవగానే.. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న మినీ వేలంతో జట్లు తమ ఏర్పాట్లను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మెగా వేలం లేకపోవడం వల్ల జట్లు ఎంతమంది ఆటగాళ్లనైనా రిటైన్ చేసుకోవచ్చు. అయితే మొత్తంగా జట్టు బలం 25 మందికి మించరాదు.. జట్టు పర్స్ కూడా రూ.120 కోట్లలోపే ఉండాలి. రిటెన్షన్ జాబితా ప్రకటించిన తర్వాత కూడా జట్లు ట్రేడ్ విండోలో మార్పులు చేయవచ్చు. అంటే ఒకవేళ ఏవైనా రెండు ఫ్రాంఛైజీలు తమ ప్లేయర్లను స్వాప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత జూన్ 4న తెరచిన ట్రేడ్ విండో డిసెంబర్ 9 వరకు అంటే వేలానికి వారం ముందు వరకు కొనసాగుతుంది.ఐపీఎల్ 2026 రిటెన్షన్స్ నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమం ప్రసారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ –ద క్షిణాఫ్రికా తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. రిటెన్షన్స్‌ను టీవీలో లైవ్‌గా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తుంది. ఇక మొబైల్ లేదా వెబ్‌లో వీక్షించాలనుకునేవారు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఐపీఎల్ 2026 రిటెన్షన్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చు.