ఢిల్లీ పేలుడు స్థలంలో బుల్లెట్లు.. ఆర్మీ దగ్గర మాత్రమే ఉండేవి ఇక్కడికెలా వచ్చాయి?

Wait 5 sec.

ఇటీవల న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఉగ్రదాడిగా ప్రకటించిన అధికారులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పేలుడు సంభవించిన స్థలంలో.. మూడు బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. ఆర్మీ జవాన్లు ఉపయోగించే 9 ఎంఎం కార్ట్రిడ్జ్‌లను ఎర్రకోటకు సమీపంలో స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఆ ప్రదేశంలో ఎలాంటి పిస్టళ్లు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు ఘటన తర్వాత నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు, భద్రతా సిబ్బందికి జారీ చేసిన బుల్లెట్లను కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు. అయితే దొరికిన బుల్లెట్లు వారికి సంబంధించినవి కాదని ధ్రువీకరించుకున్నామన్నారు. ఇవి ఎవరివో తేల్చే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా, ఇలాంటి 9 ఎంఎం కార్ట్రిడ్జ్‌లు కేవలం ఆర్మీ జవాన్ల వద్దనే ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేక పర్మిషన్ ఉన్న అతి కొద్ది మంది దగ్గరే ఉంటాయి. సాధారణ పౌరులు ఇలాంటి వాటిని వాడటానికి అనుమతి ఇవ్వరు. అలాంటిది.. ఢిల్లీ పేలుడు జరిగిన ప్రాంతంలో ఆర్మీ వాడే బుల్లెట్లు లభ్యమవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీంతో ఈ ప్రదేశానికి ఆ బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.మరోవైపు, ఆ సమయంలో కారులో అమ్మోనియం నైట్రేట్‌ దాదాపు రెండు కిలోలు ఉంటుందని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ అధికారులు సోమవారం (నవంబర్ 15) తేల్చారు. కాగా, ఘటన జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు 40 శాంపిళ్లను దర్యాప్తు అధికారులు సేకరించారు. వీటిల్లో బుల్లెట్లు, రెండు వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడితో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉమర్‌ నబీ వాడిన కారులో ఒకడే ఉన్నాడా.. ఇంకెవరైనా ఉన్నారా.. మధ్యలో ఎవరైనా దిగిపోయారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇక పేలుడు పదార్థాలు కారులోకి ఎప్పుడు ఎక్కించారు అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గురువారం దర్యాప్తు అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం 8 మంది నిందితులు.. నాలుగు నగరాల్లో పేలుళ్లకు ప్లాన్ వేశారని తెలిపారు. ఒక్కో నగరంలో ఇద్దరు చొప్పున టీమ్‌లుగా ఏర్పడి .. వారిని టెర్రర్ హ్యాండర్లు నియమించారని వెల్లడించారు. ఒక్కో టీమ్ వద్ద పలు ఐఈడీలు ఉన్నట్లు చెప్పారు.