బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ.. పోస్టాఫీసు నుంచి 10 పథకాలు.. రూ.1 లక్షకు ఏడాదికి ఎందులో ఎంతొస్తుంది?

Wait 5 sec.

FD Rates: ఈ ఏడాది 2025లో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. దీని ఫలితంగా తక్కువ వడ్డీకే డిపాజిట్లు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు డిపాజిట్ చేయాలనుకుంటున్న వారికి సైతం తక్కువ వడ్డీ రేట్లే వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి దిగ్గజ బ్యాంకుల్లోని వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోన్న పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా చాలా పెద్ద బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6-7 శాతం వరకే ఉన్నాయి. మరోవైపు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో 7 శాతానికి పైగా వడ్డీ రేట్లు ఉన్నాయి. అలాగే పాత పన్ను విధానంలో ఈ స్కీమ్స్ ద్వారా ట్యాక్స్ మినహాయింపులు సైతం పొందవచ్చు. చాలా వరకు దిగ్గజ బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కంటే పోస్టాఫీస్ పొదుపు పథకాలు బెట్టర్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అయితే, పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. కొన్నిసార్లు పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. లేదా యథాతథంగా కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతం పోస్టాఫీసు పథకాల్లో చాలా పథకాలకు 7 శాతానికి పైగా వడ్డీ వస్తోంది. మరి ఆ పథకాలు ఏవి, అందులో రూ.1 లక్ష డిపాజిట్ చేసినట్లయితే ఏడాది చొప్పున చేతికి ఎంత వడ్డీ లభిస్తుంది? వడ్డీ ఎప్పుడెప్పుడు చెల్లిస్తారు? అనే వివరాలు తెలుసుకుందాం. మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ అవుతూ కాంపౌండింగ్ వడ్డీ లభిస్తుంది. ఇందులో రూ.1 లక్ష జమ చేస్తే ఏడాదికి రూ.7,190 వరకు వడ్డీ లభిస్తుంటుంది. 3 ఏళ్ల టైమ్ డిపాజిట్ పథకం ద్వారా వార్షిక వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తారు. ఇందులో రూ.1 లక్ష జమ చేస్తే ఏడాదికి రూ.7,290 వరకు వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఇందులో రూ.1 లక్ష జమ చేస్తే రూ.7,710 వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ లభిస్తోంది. రూ.1 లక్ష జమ చేస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.2050 వరకు వడ్డీ చేతికి ఇస్తారు. అంటే ఏడాదికి రూ.8,200 వరకు చేతికి వస్తాయి. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా వార్షిక వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. ఇందులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.620 చొప్పిన వడ్డీ లభిస్తుంది. అంటే ఏడాదికి రూ.7,440 వరకు లభిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా వార్షిక వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. ఇందులో రూ.1, లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.1,44,900 వరకు లభిస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాదికోసారి వడ్డీ లెక్కించి ఇస్తారు. అయితే, 15 ఏళ్ల పీరియడ్ కొనసాగాల్సి ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రా స్కీమ్ వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. మెచ్యూరిటీ పీరియడ్ 115 నెలలుగా ఉంటుంది. ఆ తర్వాత వడ్డీ చెల్లిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. ఇందులో రూ.1 లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.1,16,020 వరకు వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన ద్వారా వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఏడాదికి ఒకసారి వడ్డీ లెక్కిస్తారు. అయితే, ఇదీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.