ఐటీ కంపెనీలకు ప్రభుత్వం బూస్టప్.. రూ. 125 కోట్లు విడుదల..

Wait 5 sec.

కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించిన రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బకాయిల్లో రూ. 125 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఐటీ పరిశ్రమలకు సంబంధించిన రాయితీలే రూ. 60 కోట్లు ఉన్నాయి. కాగా, పెండింగ్‌లో ఉన్న మొత్తం రాయితీలు, ప్రోత్సాహకాల్లో.. విడుదల చేసినవి 50 శాతం మాత్రమే. కాగా, ఏళ్లుగా వీటి పట్ల గత ప్రభుత్వం అలసత్వం వహించిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది.కంపెనీలకు ఊరట..విశాఖపట్నంలోని ఐటీ హిల్స్‌పై.. చిన్న, పెద్ద కంపెనీలన్నీ కలిసి 150 వరకు ఉన్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు (డీటీపీ) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే విశాఖపట్నం ఐటీ పార్కులో అప్లై చేసుకునే కంపెనీలకు సగం ధరకే భవనాలు ఇద్దెకు ఇచ్చేవారు. ఇంటర్నెట్, నిరంతర విద్యుత్‌ సౌకర్యం వంటివి కల్పించేవారు. ఇక ఏడాది పాటు ఒకరికి ఉద్యోగం కల్పిస్తే.. రూ. లక్ష ఆ కంపెనీలకు ప్రోత్సాహకంగా ఇచ్చేది ప్రభుత్వం. కొవిడ్‌ సమయంలో కంపెనీలకు విద్యుత్‌ ఛార్జీలు, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారని.. అనంతరం దాన్ని పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ రాయితీలన్నీ ఇప్పుడు తాము ఇచ్చామని.. దీని వల్ల ఈ కంపెనీలకు ఊరట కలుగుతోందని చెబుతోంది. పెద్ద సంస్థలైనా, చిన్న స్టార్టప్‌లకు అయినా.. ప్రభుత్వ రాయితీలు ప్రోత్సాహకాలు చాలా ఉపయోగపడతాయి. ఇటీవల ఇస్తున్నట్లు సమాచారం. అలాంటిది పదుల సంఖ్యలో ఉద్యోగులతో కార్యకలాపాలు సాగించే చిన్న ఐటీ కంపెనీలకు.. ఇది చాలా ముఖ్యం. కార్యాలయాల అద్దెలు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుంది. అంతేకాకుండా ఐటీ పరిశ్రమల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త పెట్టుబడులు కూడా రాష్ట్రానికి తరలివచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రంలోనే కొత్త స్టార్టప్‌లు ఏర్పడే అవకాశం ఉంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించి మధ్యలో వదిలేస్తే.. రాష్ట్రం అవలంభిస్తున్న పారిశ్రామిక విధానాలపై నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని చెబుతున్నారు.