బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సాధించిన అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. దీన్ని భారత ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. "జయ ఛఠ్ఠీ మైయా..." అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన .. బిహార్ ప్రజలు మరోసారి అభివృద్ధికి, ప్రజా సేవకు పట్టం కట్టారని స్పష్టం చేశారు. తాము ప్రజలకు సేవకులమని.. వారి సంతోషం కోసం కష్టపడతామని వెల్లడించారు. అందుకే కొన్ని పార్టీలు అనుసరించే 'ముస్లిం-యాదవ్‌' (ఎంవై-MY) అనే పాత బుజ్జగింపు సూత్రాన్ని పరోక్షంగా మహాఘట్‌బంధన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. దీనికి బదులుగా.. ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా బిహార్‌లో ' (ఆటవిక రాజ్యం)', 'కట్టా సర్కార్ (తుపాకీ పాలన)' యుగం తిరిగి రావడానికి అక్కడి యువత సుముఖంగా లేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈసారి ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. జంగల్ రాజ్ అంతం కావడం వల్లే ఈ మార్పు వచ్చిందని తెలిపారు.1995లో 1500 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగేదని.. 2005కు ముందు కూడా కొన్ని వందల చోట్ల జరిగినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒక్కచోట కూడా రీపోలింగ్ అవసరం రాలేదని.. ఇది బిహార్‌లో మెరుగైన శాంతి భద్రతలకు నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 'ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్'గా మారిపోయిందని.. పూర్తిగా ఆ ఎజెండానే నడుపుతోందని ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ మరోసారి చీలిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.ఇక తమ ప్రభుత్వం ఛఠ్ పూజను యునెస్కో హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చడానికి కృషి చేస్తోందని.. దాని ద్వారా ఈ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు నితీష్ కుమార్ నాయకత్వాన్ని.. పార్టీ శ్రేణులను అభినందించారు. ఈ విజయం బిహార్‌ను కొత్త శిఖరాలకు చేర్చడానికి తమలో ఉత్సాహాన్ని పెంచిందని తెలిపారు.