హీరో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ ఇష్యూ.. మంత్రి కొండా సురేఖ ట్వీట్, ఏమన్నారంటే..?

Wait 5 sec.

టాలీవుడ్ గురించి తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బహిరంగంగా పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లో నాగార్జునను కానీ.. వారి కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, దానికి నేను చింతిస్తున్నాను. నాగార్జున గారిని లేదా వారి కుటుంబ సభ్యులను కించపరచాలనే లేదా అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనల వల్ల ఏదైనా అపార్థం కలిగితే దానికి నేను చింతిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను' అని మంత్రి కొండా సురేఖ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ గతంలో కొండా సురేఖ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి వ్యక్తిగత అంశాలపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో , కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు వ్యాఖ్యలు చేశారని కేసులు వేశారు. అలాగే ఆ అంశాలకు సంబంధించిన కథనాలు ప్రచురించిన, వ్యాఖ్యలు చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్‌లు, వ్యక్తులపైనా పరువు నష్టం దావా దాఖలు చేశారు.ఈ దావా విచారణ సమయంలో.. సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు నాగార్జున గారి పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా, రాజకీయ నాయకులు లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడకుండా లేదా రాయకుండా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ సమయంలోనే నాగార్జున నుంచి స్టేట్‌మెంట్ కూడా తీసుకుంది. అనంతరం విచారణకు రావాల్సిందిగా కొండా సురేఖకు కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. అయితే అప్పటికే కొండా సురేఖ క్షమాపణలు చెప్పినట్లు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఎపిసోడ్ గతేడాది డిసెంబర్‌లో జరగ్గా.. ఇంకా పరువు నష్టం దావా కేసు విచారణలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ తాజాగా పశ్చాత్తాపం ప్రకటిస్తూ, తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం గమనార్హం.