Tata Motors Bikes: దేశంలోనే అత్యంత విలువైన, విశ్వసనీయ సంస్థల్లో టాటా గ్రూప్ అన్నింటికంటే ముందు వరుసలో ఉంటుంది. చాలా మంది ఇదే చెబుతుంటారు. నాణ్యతకు మారుపేరుగా ఈ సంస్థ ఉంటుందని అంతా నమ్ముతుంటారు. . దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న టాటా గ్రూప్ గురించి ఇటీవల కొన్ని నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశిస్తుందని వార్తలు రావడం. కొద్ది రోజులుగా దీనికి సంబంధించి.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. టాటా గ్రూప్ లోగోతో.. బైక్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు కూడా దర్శనం ఇచ్చాయి. దీంతో ఇది నిజమనే చాలా మంది అనుకున్నారు. ముఖ్యంగా టాటా బైక్స్.. ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లుక్‌లో తీసుకొస్తోందని.. దేశంలోనే అత్యంత చౌకగా రూ. 60 వేల లోపు ధరకే 125cc మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించిందని ప్రచారం జరిగింది. ఈ బైక్ మైలేజీ ఏకంగా 90 కిలో మీటర్లుగా ఉంటుందని కొన్ని మోసపూరిత వెబ్‌సైట్స్, సోషల్ మీడియాల్లో కనిపించడంతో నిజమని నమ్మారు చాలా మంది. అయితే చాలా రోజులకు.. తమ బ్రాండ్‌పై పెరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు టాటా మోటార్స్ దీనిపై కీలక ప్రకటన చేసింది.>> టాటా మోటార్స్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించడం లేదని సంస్థ అధికారింగా ఖండించింది. దీని గురించి టాటా మోటార్స్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. తమకు ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించాలనే ప్రణాళికలు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. టాటా మోటార్స్‌కు సంబంధించి.. ఏమైనా ఎలక్ట్రిక్, ప్యాసింజర్ వెహికిల్స్‌కు సంబంధించిన సమాచారం తమ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే చూడాలని పేర్కొంది. దీంతో టాటాల నుంచి బైక్స్ రావట్లేదని జనానికి ఒక క్లారిటీ వచ్చింది.ఇప్పటికే టాటాల నుంచి బైక్స్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫొటోలు నకిలీవి అని.. . ప్రస్తుతానికి టాటా మోటార్స్.. ప్యాసింజర్, కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాల్లో 4- వీలర్‌పైనే దృష్టి సారించింది. ఇటీవల టాటా మోటార్స్.. రెండు సంస్థలుగా విడిపోయింది. ప్యాసింజర్ వెహికిల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్‌గా.. ఇదే సమయంలో వేరైంది. ఆ విభజన సమయంలోనూ టూ- వీలర్స్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.