మత గురువు నుంచి పారామెడిక్‌గా మారి.. వైద్యులను ఉగ్రవాదులుగా మార్చిన మౌల్వీ

Wait 5 sec.

Faridabad Paramedic Radicalization: దేశ రాజధాని ఢిల్లీ పేలుడు దర్యాప్తులో.. ఉగ్రవాద రిక్రూట్‌మెంట్, ఆపరేషన్లలో ఎవరూ ఊహించని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే అలియాస్ ఇమామ్ ఇర్ఫాన్.. ఈ 'వైట్-కాలర్' ఉగ్ర నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదట్లో మత గురువుగా ఉన్న ఇమామ్ ఇర్ఫాన్.. ఆ తర్వాత పారామెడికల్‌గా మారి వైద్యులను ఉగ్రవాదులుగా మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా GMC శ్రీనగర్‌లో అతనికున్న పరిచయాలు, నౌగామ్‌లోని స్థానిక మసీదుల్లో అతను చేసే మత ప్రసంగాల ద్వారా.. సులభంగా ప్రభావితమయ్యే విద్యావంతులైన యువతను గుర్తించి, వారిని రాడికలైజేషన్ వైపు నెట్టేవాడని సమాచారం.మతం, వైద్యం ముసుగులో నియామకాలు..ఇర్ఫాన్ పద్ధతులు నిఘా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. అతను శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో పారామెడికల్ సిబ్బందిగా పని చేయడం ద్వారా వైద్య విద్యార్థులను సులభంగా చేరుకోగలిగాడు. అంతేకాకుండా నౌగామ్‌లోని స్థానిక మసీదుల్లో మత గురువుగా వ్యవహరిస్తూ.. అక్కడ కలిసిన విద్యార్థులతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్.. వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బ్రెయిన్ వాష్ చేసినట్లు తెలుస్తోంది.వైద్యులను ఉగ్రవాదం నడిపించడమే లక్ష్యంగా..ఉగ్రవాదం పట్ల వారికి ఉద్వేగాన్ని పెంచే జైషేకు సంబంధించిన వీడియోలను పదేపదే చూపించడం, ఇంటర్నెట్ కాల్స్‌ ద్వారా అఫ్గానిస్థాన్‌లోని వ్యక్తులతో రహస్యంగా సంప్రదింపులు జరపడం ద్వారా వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా ఇర్ఫాన్ పని చేసినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. అంతేకాకుండా మొత్తం ఉగ్ర మాడ్యూల్‌ను ఇర్ఫానే రూపొందించాడు. ఈ నెట్‌వర్క్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. భద్రతాధికారుల దాడులు, అరెస్టుల నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్.. తప్పించుకునే క్రమంలోనే దిల్లీ పేలుడుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఉమర్‌కు ప్రధాన సూత్రధారి ఇర్ఫాన్‌కు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఇక .. ఈ ఉగ్ర నెట్‌వర్క్‌కు ఫైనాన్షియర్‌గా (నిధులు సమకూర్చే వ్యక్తిగా) ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం కుట్రలో నిపుణులను ఉపయోగించి.. ఉగ్రవాద కార్యకలాపాలకు చట్టబద్ధత, కార్యాచరణ సామర్థ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించడం ఉగ్రవాదం కొత్త, ఆందోళన కలిగించే వ్యూహం అని అధికారులు పేర్కొన్నారు.