జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఆంజనేయ స్వామి ఆలయం సాక్షిగా గొప్ప దృశ్యం..!

Wait 5 sec.

హైదరాబాద్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రాంతంలో హృదయాన్ని హత్తుకునే మత సామరస్య దృశ్యాలు కనిపించాయి. పోలింగ్ బూత్‌కు చేరుకోవడానికి పక్కనే ఉన్న ఆలయం గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ.. ముస్లిం ఓటర్లు ఆలయ సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తమ నిబద్ధతను చాటుకున్నారు. బోరబండ డివిజన్‌లోని కొమరం భీం కమ్యూనిటీ హాల్‌లో ఎన్నికల అధికారులు ఒక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఈ బూత్‌కు వెళ్లాలంటే.. పక్కనే ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయం ముఖద్వారం నుంచే లోపలికి ప్రవేశించాలి. ఆలయ మెట్లు కొద్దిగా ఎక్కిన తర్వాత ఎడమవైపున కమ్యూనిటీ హాల్‌ ఉంటుంది.ఈ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటు హక్కు కలిగిన ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆలయం గుండా వెళ్లడం తప్పనిసరి అయినప్పటికీ.. ముస్లిం సోదరులు ఏ మాత్రం సంశయించకుండా ఆలయ పవిత్రతకు గౌరవం ఇచ్చారు. ఆలయ ముఖద్వారం వద్దే తమ చెప్పులను విడిచి పెట్టి లోపలికి వెళ్లి ఓటు వేసి తిరిగి వచ్చారు. ఈ దృశ్యం స్థానిక హిందూ భక్తులను, పోలింగ్ సిబ్బందిని ఎంతగానో ఆకర్షించింది.మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ ఇదే ప్రాంతంలో మరో అద్భుత దృశ్యం కనిపించింది. కొమరం భీం కమ్యూనిటీ హాల్‌తో పాటు పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసీ బంజారా నగర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి, ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో క్రైస్తవ మహిళలు స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఒకే పోలింగ్ స్టేషన్ వద్ద హిందూ ఆలయ మార్గాన్ని గౌరవించిన ముస్లింలు, వైద్య సేవలు అందించిన క్రైస్తవ మహిళలు ఉండటం అరుదైన దృశ్యంగా అనిపించింది. రాజకీయ విభేదాలు, మత ఘర్షణల వార్తలు తరచుగా వినిపిస్తున్న తరుణంలో బోరబండలో కనిపించిన ఈ అద్భుతమైన సామరస్య దృశ్యాలు, భారతదేశంలో 'భిన్నత్వంలో ఏకత్వం' అనే భావనకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయి.ఇక మంగళవారం జరగ్గా.. 48.47 శాతం పోలింగ్ నమోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. నవంబర్ 14న ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి.