రైతులకు శుభవార్త.. ఆ కష్టాలు తీరినట్లే.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం

Wait 5 sec.

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. గడిచిన రెండు, మూడు సంవత్సరాల్లోనే.. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 3 రెట్లు పెరిగింది. ఒక్క 2024-25 సంవత్సరంలోనే రాష్ట్రంలో 190 లక్షల టన్నుల ధాన్యం, 30 లక్షల టన్నుల మక్కలు, 28 లక్షల టన్నుల పత్తితో పాటు.. 20 లక్షల టన్నుల ఇతర పంటల దిగుబడి వచ్చింది. పంటలు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి అయినా రైతులకు పెద్దగా లాభం కలగడం లేదు. అందుకు కారణం.. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి అయిన పంటను కాపుడుకునేందుకు.. నిల్వ చేసుకునేందుకు రాష్ట్రంలో సరిపడా గోదాములు లేవు. దీనివల్ల పంట ఉత్పత్తి పెరిగినా సరే.. ప్రతి సంవత్సరం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సరిగా పంట చేతికొచ్చి సమయానికి అకాల వర్షాలు కురిసి పంట తడిసిపోవడం, తేమ పెరగడం మాత్రమే కాక.. ఎలుకలు, పురుగులతో తీవ్రంగా నష్టాలు జరుగుతున్నాయి. దీని వల్ల రైతులకు మాత్రమే కాక ప్రభుత్వానికి కూడా భారీ స్థాయిలో నష్టం కలుగుతుంది. ఈక్రమంలో ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం.. రూ.295 కోట్లతో 26 అధునాతన నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 253 గోదాములున్నాయి. వీటి సామర్థ్యం 24.59 లక్షల టన్నులు. అయితే ఇవన్నీ సంప్రదాయ నమూనాలో నిర్మించడంలో.. నిల్వ సమయంలో అనేక సమస్యలున్నాయి. పోనీ వీటిల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించాలన్నా వీలవ్వడం లేదు. అందుకే ప్రభుత్వం నూతనంగా అధునాతన గోదాములు నిర్మించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో.. 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో హైటెక్ గోదాములను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కొత్త గోదాములు సరకుల భద్రతకు, రవాణాకు అనుకూలంగా ఉండబోతున్నాయి అంటున్నారు. వీటిల్లో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబోతుండగా.. మిగిలిన వాటిని.. నాబార్డు నిధులతో నిర్మంచబోతున్నారు. ప్రభుత్వ నిధులతో..మొత్తం 26 గోదాముల నిర్మాణంలో.. 12 గోడౌన్లను రూ.155.68 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నారు. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. వీటిని నల్లగొండ జిల్లా దేవరకొండ, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మెదక్‌ జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా తాడ్వాయి, మంచిర్యాల జిల్లా మోదెల, హనుమకొండ జిల్లా వంగర, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, కరీంనగర్‌ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లి, వికారాబాద్‌ జిల్లా దుద్యాలలో వీటిని నిర్మించబోతున్నారు. నాబార్డు నిధులతో..మిగిలిన 14 గోదాములను రూ.140 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించబోతున్నారు. వీటి నిల్వ సామర్థ్యం 1.40 టన్నులు. జనగామ జిల్లా రామచంద్రగూడెం, సంగారెడ్డి జిల్లా బాచుపల్లి, జగిత్యాల జిల్లాలోని చెప్యాల, మల్యాల, మెదక్‌ జిల్లా ఝరాసంగం, మహబూబాబాద్‌ జిల్లా తోడేళ్లగూడెం, కొత్తగూడ, కామారెడ్డి జిల్లా జుక్కల్, మహ్మద్‌నగర్, మాల్‌తుమ్మెద, ఖమ్మం జిల్లా కమలాపూర్, వెంకటాయపాలెం, పెద్దపల్లి జిల్లా ధరియాపూర్, నాగర్‌కర్నూల్‌ జిల్లా పులిజాలలో వీటిని నిర్మించబోతున్నారు.నిల్వ చేసే సరకులకు ఎలుకలు, చీడపీడల సమస్య లేకుండా... గాలి వెలుతురు బాగా వచ్చేలా నిల్వల వృథాను నివారించేలా పర్యావరణ అనుకూలంగా నిర్మించనున్నారు. అన్ని గోడౌన్ల పైకప్పు, ఖాళీ ప్రదేశాల మీద సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అలానే సరకులను తీసుకురావడం, తరలించడానికి వీలుగా విశాలమైన దారులుండనున్నాయి. ఏఐ, డిజిటల్‌ సాంకేతికతకు అనువుగా కేబుల్‌ నెట్‌వర్క్, సీసీ కెమెరాలు, సెన్సర్లను ఏర్పాటు చేస్తారు. త్వరోలనే వీటి నిర్మాణం ప్రారంభించబోతున్నారు.