కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. కేంద్రంలోని ఎన్టీఏ సర్కారులో టీడీపీ, జనసేన పార్టీలు కీలక భాగస్వామ్యులుగా ఉండటంతో, రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన మద్దతు లభిస్తోంది. మరోవైపు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటూ ఉండటంతో .. ఆయా ప్రాంతాల్లో భూములకు మంచి డిమాండ్ వస్తోంది. తాజాగా అధికారులు దృష్టి సారించారు.గా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా రూపొందించింది. అయితే విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు పట్టాలెక్కితే విజయవాడ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా లాంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌ అవుతుందని చెప్తున్నాయి. పరిశ్రమలు విస్తరించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ఈ ప్రాంతంలో ఆస్తి విలువలు పెరుగుతాయని, ఇళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని.. అలాగే ఈ ప్రాంత జీవనశైలిలోనూ మార్పులు వచ్చే అవకాశాలు ఉందంటున్నారు. ప్రస్తుతం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి -65 ముఖ్యమైన మార్గంగా ఉంది. విజయవాడను పోర్టు సిటీ అయిన మచిలీపట్నంతో కలిపే రహదారి ఇదే. అయితే పరిశ్రమలు, లాజిస్టిక్స్, వాణిజ్యం పెరిగే కొద్దీ, ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించారని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఉండవని, ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఈ కారిడార్ వెంబడి ఖరీదైన విల్లాలు, కమర్షియల్ హబ్స్, నివాస ప్రాంతాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.దీంతో కారణంగా ఉయ్యూరు వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో భూములకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని చెప్తున్నారు.