: ఇటీవలి కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనాల్లో ఆసక్తి కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఆర్బీఐ రెపో రేట్లను వరుసగా తగ్గిస్తున్న క్రమంలో చాలా బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. ఇదే సమయంలో ఎఫ్‌డీ వడ్డీ రేట్లను కూడా తగ్గించేశాయి. వడ్డీ రేట్లు తగ్గించడంతో రాబడి తగ్గుతుంది. దీంతో జనాలు అటువైపు చూడటమే మానేశారు. వరుసగా 3 సమీక్షల్లో ఆర్బీఐ రెపో రేటును 25, 25, 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగా.. ఈ సమయంలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా ఇతర దిగ్గజ బ్యాంకులు కూడా డిపాజిట్ వడ్డీ రేట్లను గణనీయంగా చాలా సార్లు తగ్గించేశాయి. దీంతో కస్టమర్లకు రాబడి తగ్గింది. అయితే ఇప్పటికీ చాలా బ్యాంకులు సీనియర్ సిటిజెన్లకు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే వీరికి దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ వస్తుంది. ఇంకా ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కొన్ని బ్యాంకులు 5 సంవత్సరాల డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు గరిష్టంగా 8.40 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. వీటి గురించి చూద్దాం. ఇక్కడ రూ. 5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుందనేది చూద్దాం. >> అత్యధికంగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐదేళ్ల డిపాజిట్‌పై 8.40 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక్కడ ఎవరైనా రూ. 5 లక్షలు జమ చేస్తే.. మెచ్యూరిటీకి వడ్డీతోనే రూ. 2,57,678 వస్తుంది. మొత్తం చేతికి రూ. 7.57 లక్షలు వస్తాయి. >> విషయానికి వస్తే.. ఇక్కడ ప్రస్తుతం ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.25 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక్కడ 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ. 2,52,132 వడ్డీ వస్తుంది.>> జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో గరిష్టంగా 8 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక్కడ రూ. 5 లక్షలు ఒకేసారి జమ చేసినట్లయితే.. మెచ్యూరిటీకి అంటే ఐదేళ్లకు రూ. 2,42,974 వడ్డీ వస్తుంది.