ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే..

Wait 5 sec.

సౌత్ సెంట్రల్ జారీ చేసింది. షాలిమార్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ ఆధునికీకరణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసింది. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న ఈ పనుల వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి రైలు ప్రయాణాలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ పనుల వల్ల ప్రభావితమయ్యే రైళ్ల వివరాలుచర్లపల్లి - షాలిమార్ రైలు ( ట్రైన్ నెం 12842): నవంబర్ 19, 21 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు రద్దు చేయబడింది.షాలిమార్ - చర్లపల్లి రైలు (నెం.12841): నవంబర్ 20, 21 తేదీల్లో షాలిమార్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు రద్దు చేశారు. సికింద్రాబాద్ - షాలిమార్ రైలు (నెం.22850): నవంబర్ 12, 19 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ ట్రైన్ రద్దు చేశారు. షాలిమార్ - సికింద్రాబాద్ రైలు (నెం.22849): నవంబర్ 14, 21 తేదీల్లో షాలిమార్ నుంచి బయలుదేరాల్సిన ఈ ట్రైన్ కూడా రద్దు చేశారు.ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ఈ మార్పులను దృష్టిలో ఉంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు మరింత సమాచారం కోసం రైల్వే ఎంక్వైరీ నెంబర్లను సంప్రదించవచ్చు లేదా రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ ఆధునికీకరణ పనులు పూర్తి అయిన తర్వాత రైళ్ల రాకపోకలు మరింత వేగంగా, సురక్షితంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏటా మూడు నెలల పాటు జరిగే కొమురవెల్లి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటివరకు ప్రధానంగా బస్సు రవాణాపై ఆధారపడిన భక్తులకు ఇకపై రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.కొమురవెల్లిలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే హాల్ట్ స్టేషన్ పనులు వేగంగా సాగుతున్నాయని, భక్తుల సౌకర్యార్థం ఈ స్టేషన్‌లో రైళ్లు త్వరలోనే ఆగుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. ప్లాట్‌ఫాం షెల్టర్, హై లెవల్ ప్లాట్‌ఫాం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం స్టేషన్ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ రైల్వే హాల్ట్ స్టేషన్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభమవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో మల్లన్న ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది.