ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ఒకే మాటపై టీడీపీ, వైసీపీ.!

Wait 5 sec.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేదీ అంతుబట్టని విషయం. ఇక ఏపీ రాజకీయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ రాజకీయాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప్పూనిప్పులా ఉంటాయి. ఏ నిర్ణయమైనా ఓ పార్టీ సమ్మతిస్తే.. మరో పార్టీ వ్యతిరేకించడం సాధారణం. కానీ తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. , వైసీపీ ఒకే మాట మీద నిలబడుతూ, ఒకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికను పురస్కరించుకుని సీపీ రాధాకృష్ణన్ విజయం కోసం బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. వివిధ పార్టీలకు ఫోన్లు చేస్తూ మద్దతివ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని రాజ్‌నాథ్ సింగ్ వైఎస్ జగన్‌ను కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. ఓ వార్తసంస్థతో మాట్లాడుతూ గురుమూర్తి ఈ విషయాన్ని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో నలుగురు ఎంపీలతో పాటుగా.. రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు వైసీపీకి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం.. ఎన్డీఏ కూటమికి కలిసి రానుంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. కూటమి అభ్యర్థికే మద్దతివ్వనుంది.మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటు ఎన్డీఏ కూటమిలో కానీ.. ఇటు కాంగ్రెస్ పార్టీతో కానీ కలిసి లేదు. అంశాల వారీగా ఎన్డీఏకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయించింది. సంఖ్యాబలం చూస్తే ఎన్డీఏ కూటమికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావటం లాంఛనంగా కనిపిస్తోంది.