ఏనుగుల దాడిలో రైతు మృతి.. ఆదుకుంటామన్న ఏపీ డిప్యూటీ సీఎం

Wait 5 sec.

అడవుల విస్తీర్ణం తగ్గడం.. పెరుగుతున్న పట్టణీకరణ.. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. కారణాలు ఏవైనా కానీ.. జీవి వైవిధ్యంలో పెను మార్పులు సంభవించాయి. ఫలితం అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అటవీ సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్న జంతువులు.. అమాయకులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటి వరకు మనం పులి సంచారం, దాడుల్లో చనిపోయిన వ్యక్తుల గురించి ఎక్కువగా విన్నాం. కానీ ఇప్పుడీ జాబితాలోకి ఏనుగులు కూడా చేరాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో విచారకర సంఘటన చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో రైతు చనిపోయాడు. ఆ వివరాలు.. . ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందారు. సోమల మండలం కొత్తూరులో ఈ దుర్ఘటన వెలుగు చూసింది. ఏనుగులు గుంపు దాడి చేయడం వల్ల రామకృష్ణంరాజు అనే రైతు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అలానే రైతు మృతికి నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు రామకృష్ణంరాజు మృతదేహాన్ని కదిలించేది లేదని వారంతా భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎఫ్ఓ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సంఘటన స్థలానికి వెళ్లారు. అయితే అటవీశాఖ నిర్లక్ష్యం వల్లే రైతు రామకృష్ణంరాజు చనిపోయాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు రాత్రి నుండి మృతదేహాన్ని తరలించడానికి నిరాకరిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు రామకృష్ణంరాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపేది లేదని తేల్చి చెప్పారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసనకు దిగారు.ఈ సంఘటన కాస్త . ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సంఘటన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలానే చనిపోయిన రామకృష్ణంరాజు కుటుంబానికి పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.ఇదిలా ఉంటే శనివారం నాడు తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. . కానీ బైకర్ల అదృష్టం బాగుండి.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేడు ఏనుగుల గుంపు దాడిలో చిత్తూరు జిల్లా వాసి చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.