Jensen Huang: నేను బిలియనీర్ల సృష్టి కర్తనంటూ ప్రపంచ దిగ్గజ సంస్థ జెన్సన్ హువాంగ్ సంచనల వ్యాఖ్యలు చేశఆరు. ఆన్ ఇన్ పాడ్ కాస్ట్ బృందం, హిల్ అండ్ వ్యాలీ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. తన మేనేజ్‌మెంట్లో ఎక్కువ మంది బిలియనీర్లు తయారయ్యారంటూ ఉద్ఘాటించారు. పరిమిత సంఖ్యలో చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధక బృందాలను ఏర్పాటు చేసి తమ కంపెనీ ఏ విధంగా విజయాలు అందుకుంది, ఏ విధంగా ఆర్థిక ఫలాలను అందుకుంది అనే వివరాలు వెల్లడించింది. 'నా మేనేజ్‌మెంట్ టీంలో చాలా మంది బిలియనీర్లను సృష్టించాను. ప్రపంచంలోని ఏ కంపెనీ సీఈఓకు ఇది సాధ్యం కాలేదు. ప్రస్తుతం 150 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుల టీమ్‌లు ఉన్నాయి. వారికి మెరుగైన ఫండింగ్ ఇవ్వగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. పెద్ద బృందాలకు సరైన వసతులు కల్పిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 150 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులున్న కంపెనీకి 20-30 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారు.' అని పేర్కొన్నారు. చిన్న చిన్న కృత్రిమ మేధ పరిశోధక బృందాల ప్రభావం, వాటి విలువపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చాట్‌జీపీటీని తయారు చేసినప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీలో 150 మంది ఉండేవారని, చైనాలోని డీప్ సీక్ లో కూడా ఇంతే మంది ఉన్నట్లు చెప్పారు. వాటిని తన జేబులో నుంచే ఇస్తున్నట్లు చెబుతూ నవ్వులు పూయించారు. ఇప్పటికీ ఉద్యోగులకు అందించే కాంపెన్సేషన్ వివరాలను తాను పరిశీలిస్తానని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేక శైలిని అనుసరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా మెషీన్ లెర్నింగ్ వాడుతున్నానన్నారు. కంపెనీ నిర్వహణ వ్యయాలు పెంచామని అంగీకరించారు. ఉద్యోగులను చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని జెన్సన్ హువాంగ్ తెలిపారు.