సమాజంలో మానవ సంబంధాలు, బంధాలకు విలువ లేకుండా పోతోందా..? తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల పట్ల కూడా కరుణ లేకుండా ప్రవర్తిస్తున్నారా..? నమ్మశక్యం కాని ఒక దారుణమైన ఘటన నల్గొండలో జరిగింది. రెండేళ్ల ముక్కుపచ్చలారని కుమారుడిని బస్టాండ్‌లో వదిలేసి.. కన్నతల్లి ఒక ప్రియుడితో పారిపోయింది. కన్నప్రేమకు, మానవత్వానికి మసిపూసిన ఈ అమానవీయ చర్య ప్రతి ఒక్కరి మనసునూ కలిచివేస్తుంది. బస్టాండ్‌లో బాలుడి ఆక్రందన.. శనివారం నల్గొండ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటన అక్కడున్నవారి గుండెల్ని పిండేసింది. తల్లి కనిపించకపోయేసరికి గుక్కపట్టి ఏడ్చిన ఆ పసివాడిని చూసి అక్కడి ఆర్టీసీ సిబ్బంది కదిలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నల్గొండ రెండో పట్టణ ఎస్సై సైదులు అక్కడికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన ఒక యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మహిళ పరిచయమైంది. ఆ యువకుడి కోసం ఆమె హైదరాబాద్‌ నుంచి నల్గొండ చేరుకుంది. బస్టాండ్‌లో తన కుమారుడిని ఒంటరిగా వదిలేసి, అక్కడి నుంచి ప్రియుడితో కలిసి బైక్‌పై వెళ్లిపోయింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వారి జాడను గుర్తించారు. తక్షణమే ఆ వ్యక్తిని, మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మహిళ ఇచ్చిన సమాచారంతో ఆమె భర్తను అక్కడికి పిలిపించి.. ఆ అమాయక బాలుడిని అతనికి అప్పగించారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా పరిచయాలు.. దారి తర్వాత అది మెళ్లగా.. ప్రేమగా మారడం సర్వసాధారణమైంది. అయితే.. ఇది కొన్నిసార్లు వివాహ బంధాలను, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన నిజంగా మనసును కలిచివేసేది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన ప్రియుడి కోసం ఒక మహిళ కన్నబిడ్డను అనాథను చేయడానికి పూనుకుంది. నల్గొండకు చెందిన ఆ మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. దాదాపు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు తన వెంట రావాలని తరచుగా అడగడం మొదలుపెట్టాడు. గత రెండు, మూడు రోజులుగా అతడి వేధింపులు ఎక్కువ కావడంతో.. ఆమె అతని మాటను కాదనలేకపోయింది. ఇంటి నుంచి కొడుకుతో పాటు నల్గొండ బస్టాండ్‌కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ప్రియుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ప్రియుడు రాగానే, ఆమె తన కొడుకును బస్టాండ్‌లోనే వదిలేసి, బయట వేచి ఉన్న ప్రియుడితో కలిసి బైకుపై జంప్ అయింది. పాపం, ఆ పిల్లాడు! తల్లి ఎంతకీ తిరిగి రాకపోవటంతో భయపడి, అటుఇటు తిరుగుతూ ఏడుస్తూ ఉండిపోయాడు. బాలుడి పరిస్థితిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా తల్లి ఆనవాళ్లను గుర్తించి, ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ బిడ్డని భర్తకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీల్లో ఆ మహిళ ప్రియుడితో వెళ్ళిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇన్స్టాగ్రామ్ పరిచయం కోసం కన్నబిడ్డను దిక్కు లేని అనాథగా బస్‌స్టాండ్‌లో వదిలేసిన ఈ ఘటన సమాజంలో బంధాల పట్ల పెరిగిన నిర్లక్ష్యానికి, స్వార్థానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.