ఆ దంపతుల కలను చెరిపేసిన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్.. వేరే వ్యక్తి వీర్యంతో ఇలా..

Wait 5 sec.

పడే కష్టాలు వర్ణనాతీతం. ఆశగా.. ఆవేదనతో వారు ఆశ్రయించే వైద్య కేంద్రాలు, అక్కడ ఎదురయ్యే మోసాలు వారి ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. తమ కలల కోసం వేల, లక్షల రూపాయలు ఖర్చు చేసి.. మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత కూడా మోసపోతే వారి బాధ వర్ణించలేం. అలాంటి ఒక దారుణ సంఘటన సికింద్రాబాద్‌లోని ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆ కేంద్రాన్ని పరిశీలించారు. సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసం..సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒక మహిళ తన భర్త వీర్యకణాలతో సంతానం కావాలని ఈ కేంద్రాన్ని ఆశ్రయించగా.. ఆస్పత్రి సిబ్బంది ఆమె భర్త కాకుండా మరొకరి వీర్యకణాలతో ఐవీఎఫ్ పద్ధతిలో పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. వివాహమై చాలా ఏళ్లు పిల్లలు కలగకపోవడంతో ఆ దంపతులు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆ చిన్నారి తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో.. వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దంపతులిద్దరి కుటుంబాలకు క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో వారికి అనుమానం కలిగింది. దీంతో వారు మరోసారి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను సంప్రదించగా.. వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి శిశువు తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోలలేదు. శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలింది. దీంతో బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సరోగసి (అద్దె గర్భం) కోసం పెద్ద మొత్తంలో వీర్యాన్ని నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతులను పాటిస్తున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌తో పాటు, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైద్య రంగంలో నకిలీ, అక్రమ కార్యకలాపాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం, వైద్య నియంత్రణ సంస్థలు ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి కేంద్రాలను ఆశ్రయించేటప్పుడు పూర్తిగా విచారించుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.