ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపికబురు చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసును ప్రజలు పొందవచ్చు. గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం రూ.40 చెల్లించాల్సి ఉండేదని చెబుతున్నారు.. కానీ ఇకపై ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు నిండిన వారికి ను డిజిటల్‌గా ఇస్తోంది. ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందడం సులువు అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా పొందవచ్చు. అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్‌తో పాటూ అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తారు.. ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా ఇస్తారు. ఈ కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పది, 15 నిమిషాల్లో ఇస్తారు. సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు టికెట్‌లో 25 శాతం రాయితీ లభిస్తుంది. అలాగే దూరం వెళ్లే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో రెండు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్‌ చేస్తారు. రైల్వే స్టేషన్‌లలో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు.. వీల్‌ఛైర్ల సదుపాయం, లోయర్ బెర్త్‌ల కేటాయింపులో ప్రాధాన్యత, రైలులలో ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు బెర్త్‌లు, థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్‌లు, సెకండ్ ఏసీలో మూడు బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌లకు (ఎవరు ముందుగా రిజర్వేషన్‌ చేసుకుంటే వారికి) కేటాయిస్తారు. సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి కొత్త పాస్‌పోర్టు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఫీజులో 10 శాతం తగ్గింపు ఉంది. అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కోర్టుల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కేటాయిస్తారు. బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్ కౌంటర్ ఉంటుంది.. సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. 60-79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదనంగా 0.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అదే 80 ఏళ్లుపైబడిన వారికి అయితే 1% వడ్డీ రేటు లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఉపయోగలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు. అలాగే సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి ఆదాయ పన్ను విషయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.