New Rules: జూలై నెల ముగించుకుని ఆగస్టు నెలలోకి అడుగుపెడుతున్నాం. సాధారణంగా కొత్త నెల ప్రారంభ అవుతుంటే కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన మార్పులు సామాన్యులపై భారం పెంచవచ్చు. చిన్న చిన్న మార్పులే మీ జెబుకు చిల్లు పెట్టవచ్చు. వీటితో పాటు ఈసారి క్రెడిట్ కార్డు, యూపీఐ, బ్యాంకింగ్ సహా చాలా మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్న ఫైనాన్షియల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ ధరలు.. వంట గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల 1వ తేదీన సమీక్షిస్తుంటాయి. గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరల్లో మార్పు చేస్తూ వచ్చాయి. ఈసారి సబ్సిడీ లిసిండర్ ధరల్లో మార్పు ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి గ్యాస్ ధరలు తగ్గవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. మరి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సిందే. యూపీఐ కొత్త రూల్స్.. యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్న వారు ఆగస్టు 1 నుంచి వస్తోన్న కొత్త రూల్స్ తెలుసుకోవాలి. ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను కేవలం 25 సార్లు చేక్ చేయవచ్చు. ఆటో పే వంటి సర్వీసుల ట్రాన్సాక్షన్లు మూడు స్థిర స్లాట్లలో మాత్రమే ప్రాసెస్ కానున్నాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1-5 గంటల మధ్య, రాత్రి 9.30 గంటల తర్వాత మాత్రే ప్రాసెస్ అవుతాయి. ఇక ఫెయిల్ అయిన లావాదేవీల స్టేటస్ రోజుకు మూడు సార్లు చెక్ చేయవచ్చు. రెండు ట్రాన్సాక్షన్ల మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉండాలి. క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్క్రెడిట్ కార్డులకు అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సును తొలగించింది. ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. పలు కార్డులపై ప్రస్తుతం అందిస్తున్న రూ.50 లక్షలు, రూ.1 కోటి వరకు ఉచిత విమాన ప్రమాద బీమా పాలసీలను ఆపేస్తోంది. ట్రేడింగ్ సమయం పెంపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కాల్ మనీ, మార్కెట్ రెపో, ట్రై పార్టీ రెపో మార్కెట్స్ వంటి వాటిల్లో ట్రేడింగ్ సమయాన్ని పెంచింది. ఆగస్టు 1 నుంచి రెండు దశల్లో ఈ మార్పు ఉండనుంది. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ ద్వైమాసిక సమీక్షా సమావేశం ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈసారి కూడా రెపో రేటును భారీగా తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రుణాలపై వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి. CNG, PNG ధరలుచమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే ఏప్రిల్ 9 నుంచి వాటి ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. ముంబైలో సీఎన్‌జీ ధర కిలోకు రూ. 79.50, పీఎన్‌జీ ధర యూనిట్‌కు రూ.49గా ఉంది. అయితే కొత్త నెలలో ధరలు మారే అవకాశం ఉంది. ఇది ప్రజా రవాణా, ఇంటి ఖర్చులను ప్రభావితం చేయనుంది.