ఇండియాపై ట్రంప్ సుంకాల దెబ్బ.. ఆ ఒక్క రంగంలోనే రిస్క్‌లో లక్ష మందికిపైగా ఉద్యోగులు!

Wait 5 sec.

Job Loss: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి . ఇంకా తాము వ్యతిరేకిస్తున్నా రష్యా నుంచి చమురు, సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ కూడా విధించారు. అయితే ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. భారత జీడీపీపై 0.2- 0.5 శాతం లేదా 30 బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ. 2.60 లక్షల కోట్లు) ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రత్నాభరణాలు, స్టీల్, అల్యూమినియం, వాహనాల విడిభాగాలు, రొయ్యలు, జౌళి, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఇతర ఆహారోత్పత్తుల ఎగుమతులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాకు భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు రత్నాభరణాల ఎగుమతి జరుగుతుంది. ఇది ఇప్పుడు కళ తప్పనుంది. అంటే భారీగా ఇక్కడ ఎగుమతులు తగ్గుతాయని చెప్పొచ్చు. రత్నాభరణాల తయారీదారులు, ఎగుమతిదారులను ఉటంకిస్తూ.. ఏఎన్ఐ దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఏకంగా ఈ రంగంలోనే లక్షకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది.'ముఖ్యంగా చేతితో తయారుచేసిన ఆభరణాల (హ్యాండ్‌మేడ్ జువెల్లరీ) ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ ఉత్పత్తుల్ని ఇకపై అక్కడ విక్రయించలేరు. లేదా అంగీకరించరు.' అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డే అన్నారు. అంతకుముందు అమెరికా 10 శాతం సుంకాలు విధించినప్పుడే.. ఈ ఇండస్ట్రీలో దాదాపు 50 వేల మందికిపైగా ఉద్యోగులు ప్రభావితమైనట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు రోక్డే చెప్పుకొచ్చారు. 'అంతకుముందు 10 శాతం సుంకాలు ఉన్నప్పుడు.. దాదాపు 50 వేల మందికిపైగా నిరుద్యోగులుగా మారారు. ఇప్పుడు అదే పునరావృతమైతే గనుక ఈసారి సుమారు లక్ష మందికిపైగా ప్రభావితమవుతారు. ఇది భారత రత్నాభరణాల పరిశ్రమకు చాలా ఇబ్బందికరం. దురదృష్టకరం.' అని రాజేష్ రోక్డే వివరించారు. ఇక్కడ మరో కీలక విషయం చెప్పారు. ఈ టారిఫ్స్ ఎఫెక్ట్.. భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని,, అక్కడే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఇదే సమయంలో అమెరికా.. ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాల్ని భవిష్యత్తులో ఏమైనా తగ్గించొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆరో విడత ద్వైపాక్షిక చర్చలు ఆగస్టులోనే జరగనున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.