తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెజిటెడ్ హెడ్ మాస్టర్ (GHM), అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో చాలా మంది ఉపాధ్యాయుల కల నెరవేరనుంది. అయితే.. పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్‌లను అవసరమైన బడుల్లోనే నియమిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం నాడు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ విషయమై ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల షెడ్యూల్ విడుదల.. ఈ పను కూడా విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం పది రోజుల్లో ఇది పూర్తవుతుంది. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (RJDలు), జిల్లా విద్యా శాఖాధికారులకు (DEOలు) ఈ షెడ్యూల్‌ను పంపించి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదోన్నతుల షెడ్యూల్ వివరాలు.. ఆగస్టు 2: గెజిటెడ్ హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు, అలాగే గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి పొందాలనుకునే స్కూల్ అసిస్టెంట్‌ల సీనియారిటీ జాబితాలు, స్కూల్ అసిస్టెంట్‌ల పదోన్నతికి సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGTలు) సీనియారిటీ జాబితాలను ఆన్‌లైన్‌లో, డీఈఓల వెబ్‌సైట్లలో పెడతారు. ఆగస్టు 3: ప్రభుత్వ, స్థానిక సంస్థల బడుల్లోని స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తీసుకుంటారు. ఆగస్టు 4, 5: వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి, తుది సీనియారిటీ జాబితాలను విడుదల చేస్తారు. ఆగస్టు 6: పదోన్నతి కోసం స్కూల్ అసిస్టెంట్‌లు తమకు నచ్చిన చోటు కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఆగస్టు 7వ తేదీన.. గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్‌లకు పదోన్నతి ఉత్తర్వులు ఇస్తారు. ఆగస్టు 8, 9వ తేదీల్లో.. గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చాక, స్కూల్ అసిస్టెంట్, ఇతర క్యాడర్లలో ఖాళీలు ఎంత ఉన్నాయో చూపిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు తీసుకుని పరిష్కరించాక, తుది జాబితాలు ప్రకటిస్తారు. ఆగస్టు 10వ తేదీన స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కోసం సెకండరీ గ్రేడ్ టీచర్స్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 11వ తేదీన జిల్లా కలెక్టర్ ఆమోదం వచ్చాక సెకండరీ గ్రేడ్ టీచర్స్ పదోన్నతి ఉత్తర్వులు జారీ చేస్తారు. దాదాపు 2,000 మందికి లబ్ధి.. దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుంది. గత సంవత్సరం సుమారు 1,500 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చారు. అయితే.. కొన్ని కారణాల వల్ల, అలాగే పదవీ విరమణల వల్ల మల్టీజోన్ 2 లో దాదాపు 750 ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇచ్చి ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.అదేవిధంగా.. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు రావడంతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లతో (SGTలతో) నింపుతారు. డీఎస్సీ 2012 తర్వాత పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు), భాషా పండితులకు కూడా అప్‌గ్రేడ్ చేయాల్సిన 800 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి కూడా పదోన్నతులు కల్పించనున్నారు.