ఆంధ్రప్రదేశ్‌కు లులుమాల్‌ రాబోతోంది.. రెండు నగరాల్లో ఏర్పాటు కాబోతోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ రెండు నగరాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. లులు సంస్థకు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్‌లో 13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. (ఏపీఐఐఐసీ) APIIIC ద్వారా ఈ కేటాయించారు.. ఇక్కడ భారీ షాపింగ్ మాల్‌ను లులు నిర్మించనుంది. విశాఖపట్నంలో 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులు మాల్ రానుంది. ఇందులో లులు సూపర్ మార్కెట్‌తో పాటుగా లులు ఫ్యాషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, లులు కనెక్ట్ వంటివి ఉంటాయి. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తోంది. అందుకే మూడేళ్ల లీజు మాఫీని వర్తింపజేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానం 2024-29 ప్రకారం భూమి ధరను నిర్ణయిస్తారు. (ఏపీఐఐఐసీ) APIIIC, రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటాయి అని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాబోతోంది. 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం విజయవాడ సమీపంలోని ఆర్టీసికి చెందిన 4.15 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, ఈ స్థలంలో ఉన్న ఆర్టీసీ నిర్మాణాలను వేరే చోటికి తరలించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.త్యామ్నాయంగా ఆర్టీసీకి భూమిని ఇచ్చి, ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఏపీఐఐసీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటక భూముల కేటాయింపు విధానం పరిధిలోకి మాల్స్, రెస్టారెంట్లు తరహా ప్రాజెక్టులను చేర్చాలని ఉత్తర్వుల్లో తెలిపింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఏపీఐఐసీ రెండు ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.