ఉద్యోగులకు ఈసారి డీఏ పెంపు ఎంత? రూ. 35 వేల జీతంపై ఎంత పెరుగుతుంది.. లెక్కలివే..!

Wait 5 sec.

: ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతూ వెళ్తోంది. అంటే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నమాట. దీనికి తగ్గట్లుగానే జీతాలు పెరుగుతున్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇక్కడ దీని కోసం . ప్రైవేటులోనూ ఉన్నా.. ఇది చాలా తక్కువే ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు పరిహారంగా.. ఇక్కడ ప్రతి ఏడాది రెండు సార్లు డీఏను ప్రకటిస్తుంటుంది. ఇది దాదాపుగా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. ప్రస్తుతం డీఏ 55 శాతంగా ఉండగా.. మరోసారి ఇప్పుడు పెరగాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కేంద్రం డీఏ ప్రకటన రెండు సార్లు చేస్తుంటుంది. సాధారణంగా జనవరి, జులైలో డీఏ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం కాస్త ఆలస్యంగా మార్చిలో ఒకసారి, అక్టోబర్/నవంబర్‌లో మరోసారి ప్రకటిస్తుంటుంది. ఎప్పుడు ప్రకటించినా బకాయిలతో కలిపి జనవరి, జులై 1 నుంచే అమలు చేస్తుంటుంది. చివరిసారిగా మార్చి నెలలో 2 శాతం డీఏ పెంచగా 53 శాతం నుంచి 55 శాతానికి చేరింది. దీంతో దాదాపు కోటి మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందారు. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ డీఏ పెంపు ప్రకటిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండగా.. ఉంటుంది. డీఏను ఇండస్ట్రియల్ వర్కర్స్- కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI- IW) ఆధారంగా నిర్ణయిస్తారు. దీనిని కేంద్ర కార్మిక శాఖ విడుదల చేస్తుంటుంది. దీనిని బట్టి ఈసారి డీఏ మరో 3 శాతం పెరుగుతుందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న 55 శాతం నుంచి 58 శాతానికి చేరుతుందన్నమాట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరో 3 శాతం డీఏ పెరిగితే జీతం ఎంత పెరుగుతుందనేది చూద్దాం. డీఏ పెంపు అనేది ఉద్యోగి కనీస వేతనంపై (బేసిక్ పే) అమలవుతుంది. ఉదాహరణకు ఉద్యోగి బేసిక్ పే రూ. 35 వేలు అనుకుంటే 55 శాతం లెక్కన ప్రస్తుతం డీఏ రూ. 19,250 వస్తుంది. ఇక ఇది మరో 3 శాతం పెరిగితే ఆ మొత్తం రూ. 20,300 కు చేరుతుంది. అంటే రూ. 1050 పెరుగుతుందన్నమాట. ఇలాగే పెన్షన్‌పైనా వర్తిస్తుంది. డీఏ పెరిగితే టేక్ హ్యాండ్ శాలరీ పెరుగుతుంది. వచ్చే ఏడాది అమల్లోకి వస్తే ఈ డీఏ బేసిక్ శాలరీలో విలీనమై మళ్లీ సున్నా శాతం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.