ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ అంశంపై లోక్‌సభలో. దీంతో అమిత్ షా జోక్యం చేసుకుని.. ప్రతిపక్షక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జైశంకర్ స్పష్టంగా ప్రకటన చేసినా విపక్షాలు ప్రశ్నించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. భారత విదేశాంగ మంత్రిని చెబుతున్నా నమ్మడం లేదు కానీ, అమెరికా చెప్పేవి నమ్ముతున్నారంటూ మండిపడ్డారు. ‘‘భారత విదేశాంగ మంత్రిపై నమ్మకం లేదు కానీ అమెరికా చెప్పేదాన్ని నమ్ముతున్నారు... ఇది విపక్షాల తీరు!’ అంటూ షా విమర్శించారు. మూడు నెలల కిందట పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన‘వారు (ప్రతిపక్షాలు) విదేశీ ప్రభావానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో నేను అర్థం చేసుకోగలను.. కానీ అర్థంలేని ఆరోపణలు ఇక్కడ ఆపాదించొద్దు... అందుకే వాళ్లు ఆ సీటులో కూర్చున్నారు... వచ్చే 20 ఏళ్లు కూడా అలా కూర్చోవాల్సిందే’ అని కేంద్ర హోమ్ మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టాండ్‌ను విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించానని చేస్తోన్న ప్రచారాన్ని జైశంకర్ ఖండించారు. కాగా, పహల్గామ్ దాడికి పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం గత రెండు వారాలుగా కీలక మిషన్ చేపట్టింది. ‘‘ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య ఎటువంటి ఫోన్ కాల్ జరగలేదు’’ అని జైశంకర్ స్పష్టం చేశారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలూ పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ ఎప్పటికీ అంగీకరించదని జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు నినాదాలు చేయడంతో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. మన దేశ విదేశాంగ మంత్రిని నమ్మరు...? అప్పుడు ఏవిధమైన చర్చ?" అని విపక్షాలను ప్రశ్నించారు. సభలో కొంతసేపు ఇరు పక్షాలు అరుపులు, నినాదాలతో గందరగోళం నెలకుంది. తొలుత ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించిన విషయం తెలిసిందే.