అన్నదాత సుఖీభవ పథకం.. వారందరికి రూ.7వేలు రావు, వెంటనే ఇలా చేయండి.. చాలా సింపుల్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ మేరకు ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.7వేల చొప్పున జమ చేయనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాలను ప్రదర్శించగా.. ఇప్పటికి పలువురు రైతులు కొన్ని కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. లో తమ పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్ వివరాలు సరిగా లేకపోవడంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది రైతుల ఆధార్ కార్డు వివరాలు వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలతో సరిపోలడం లేదు. పేర్లు తప్పుగా ఉండడం, చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సూచించింది. రైతుల వివరాల్లో తప్పులు ఉండటంతో తహసీల్దార్ల లాగిన్‌లలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం జిల్లాల అధికారులకు తెలిపింది. రికార్డుల్లోని వివరాల ఆధారంగా అర్హులకు న్యాయం చేయాలని కోరింది. ఆధార్ కార్డుల్లో మార్పులు ఉంటే, వీఆర్వోల సహాయంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. అర్హుల జాబితాలో పేర్లు లేనివాళ్లు, డబ్బులు జమకాని వాళ్లు వెంటనే ఈ తప్పుల్ని సరిచేసుకోవాలని సూచించారు.ఏపీ ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలలో భాగంగా ‘పీఎం కిసాన్‌- అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో మొత్తం 46,85,838 మంది రైతులు లబ్ధి పొందుతారు. మొదటి విడతలో కేంద్రం ‘పీఎం కిసాన్‌’ పథకం కింద రూ.2 వేలు సాయానికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7వేలు చొప్పున బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు జమ చేస్తుంది. దీనికి అదనంగా కేంద్రం రూ.831.51 కోట్లు అందిస్తుంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పింది.. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6వేలకు.. ఏపీ ప్రభుత్వం రూ.14వేలు కలిపి రూ.20 వేలు ఇస్తోంది. రైతులు గురించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ అన్నదాతా సుఖీభవ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయం, పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో అన్నదాతసుఖీభవ పథకం ప్రారంభోత్స కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతుల మొబైల్స్‌కు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సమాచారం పంపాలని సూచించారు.