రైతులకు బోనస్ డబ్బులు రెడీ.. ఇక అకౌంట్ చెక్ చేసుకోవడమే.. ముహూర్తం ఇదే..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది నిజంగా ఒక సంతోషకరమైన వార్త. ప్రభుత్వం పండించిన సన్న ధాన్యం (సన్నాలు) క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన 'ప్రజా పాలన ప్రగతి బాట' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, చీడపీడల దాడి వల్ల పంట నష్టాలు తరచుగా సంభవిస్తున్నాయి. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, పెట్టుబడులకు తగిన మద్దతు ధర లభించకపోవడం, మధ్యవర్తుల దోపిడీ, ధాన్యం కొనుగోలులో జాప్యం వంటి సమస్యలు అన్నదాతలను నిరంతరం వేధిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించడం . ఇది వారి నష్టాలను కొంతవరకు పూడుస్తుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కేవలం 18 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 6 వేల పైచిలుకు రేషన్ కార్డులను పంపిణీ చేశామని వివరించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ... సున్నా వడ్డీతో 65 లక్షల మంది మహిళలకు రూ.25 వేల కోట్ల రుణాలను అందించామని మంత్రి తెలిపారు. గతంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులుగా 18 సంవత్సరాలు ఉన్న మహిళలకు మాత్రమే రుణాలు లభించేవని, 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు అవకాశం లేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వయో పరిమితిని 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు తగ్గించిందని.. అలాగే గరిష్ట వయసును 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ చేసిందని వివరించారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే మన ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఏకంగా రూ.5 వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. దానిని భారం అని భావించడం లేదని అన్నారు. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. పేదల ఇంటి పెద్ద కొడుకులా తాను ప్రజలతో ఉంటానని.. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీలు.. పథకాల అమలు రైతాంగంలో, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే అవకాశం ఉంది.