భారత్‌పైపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ‘‘25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు అమెరికా చేసిన ప్రకటనపై పూర్తిగా అధ్యయనం చేసి.. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. ట్రంప్ టారిఫ్‌లపై భారత్ ఆచితూచి స్పందించింది. వాస్తవానికి ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాలను ప్రకటించిన వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఈ సమయంలో‘అమెరికా అధ్యక్షుడి ద్వైపాక్షిక వాణిజ్యంపై చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం గమనించింది. దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేస్తోంది.. గత కొన్ని నెలలుగా భారత్ - అమెరికా మధ్య ఆమోదయోగ్యమైన, పరస్పర ప్రయోజకరమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. భారత్ దానికి కట్టుబడి ఉంది’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు, రైతులు, ఔత్సాహి పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల (MSMEs) సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా పేర్కొంది. అదేసమయంలో ఇటీవల బ్రిటన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్నికూడా ప్రస్తావించింది.‘‘ఇతర వాణిజ్య ఒప్పందాల సమయంలో జరిగినట్లుగానే, ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ నొక్కిచెప్పింది. కి ఇది నిదర్శనం. భారత్‌పై 25 శాతం సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' ద్వారా ట్రంప్ వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత దారుణమై వాణిజ్య విధానాలు అవలంభిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటి. ఎక్కువగా ఆర్థికేతర నిర్బంధాలు, అడ్డంకులు భారత్ అమలు చేస్తోంది.. ఇది మంచిది కాదు!’ అంటూ విమర్శలు గుప్పించారు. రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, టారిఫ్‌లపై ప్రకటనకు ముందు అమెరికా ప్రతినిధుల బృందం ఆగస్టు 25న న్యూఢిల్లీలో వాణిజ్య ఒప్పందంపై ఆరో విడత చర్చలకు రానున్నట్టు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యను ఒత్తిడికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారత్ చమురు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. యుద్ధానికి ముందు 0.2% ఉండగా.. ఇప్పుడు సుమారు 35-40% వరకు పెరిగాయి. ఈ విషయంలో చైనా తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోన్న రెండో అతిపెద్ద దేశగా భారత్ నిలిచింది. అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని యత్నిస్తున్న సమయంలో, భారత్ వ్యవహారం తప్పుడు సంకేతాలు పంపుతోందని ట్రంప్ మండిపడుతున్నారు.