తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి ఖరీదైన కానుక.. 2.5 కేజీల బంగారంతో శంఖం, చక్రం.. ఎన్ని కోట్లంటే!

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిరోజూ కానుకల్ని, విరాళాల్ని అందజేస్తుంటారు. కొందరు భక్తులు నగదు, బంగారం, వెండి, విలువైన వస్తువుల్ని హుండీలో కానుకలుగా సమర్పిస్తుంటారు.. మరికొందరు భక్తులు ఖరీదైన బంగారం, వెండి, విరాళాలను నేరుగా టీటీడీకి అందజేస్తారు. కొందరు భక్తులు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు భారీగా విరాళాలు అందిస్తుంటారు. ఇటీవల కాలంలో టీటీడీకి భక్తులు భారీగా విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కి మరో భక్తుడు ఖరీదైన కానుకల్ని అందజేశారు.చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు కి సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రాన్ని కానుకగా సమర్పించారు. చెన్నై నుంచి వచ్చిన ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం, చక్రాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం ఏఈవో వెంకయ్య చౌదరి దాతల్ని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి చెన్నై భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆభరణాలను ఆలయంలో స్వామివారికి అలంకరించనున్నారు.శ్రీనివాస కల్యాణోత్సవాల నిర్వహణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్షటీటీడీ శ్రీనివాస కల్యాణోత్సవాలను మరింత పటిష్టాత్మకంగా నిర్వహించేందుకు విధి, విధానాలు రూపొందించాలని ఈవో జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీ వీరబ్రహ్మంలతో కలిసి అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. 'కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని మరింత విశ్వ వ్యాప్తం చేసేందుకు శ్రీనివాస కల్యాణోత్సవాలను చేపడుతున్నారు.. టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా కల్యాణోత్సవం ప్రాజెక్ట్ అధికారులు కల్యాణోత్సవాల నిర్వహణకు నివేదిక రూపొందించాలి. శ్రీనివాస కల్యాణోత్సవాలను వ్యాపార దృక్పధంతో కాకుండా భక్తి భావంతో నిర్వహించే సంస్థలు, నిర్వహణ వ్యక్తుల ఎంపిక , ఏ ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు, ఆర్థిక, న్యాయపరమైన తదితర అంశాలపై ముందుగా ఎంవోయూ చేసుకునేలా పటిష్ట నియమాళిని రూపొందించాలి' అన్నారు ఈవో. 'ఇప్పటికే ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలను విదేశాల్లో నిర్వహిస్తున్న క్రమంలో ప్రణాళికా బద్ధంగా శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్వహణలో చేయవలసిన పనులు, చేయరాని పనుల జాబితాను రూపొందించి, అందుకు అనుగుణంగా పటిష్టంగా నిర్వహణకు నిబంధనలు తయారు చేయాలి. తిరుమలలో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఈవో, వ్యర్థాల నిర్వహణలో టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి' ఆదేశించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది.