పీఎం కిసాన్ 20వ విడత డేట్ ఫిక్స్.. ఈసారి పక్కా.. ఆరోజే రైతుల ఖాతాల్లోకి రూ.2000

Wait 5 sec.

20th Installment: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలు అందిస్తోంది. వీటితో పాటుగా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే 19 విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవగా 20వ విడత సాయం కోసం కోట్లోది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జూలై నెలలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంటారు. కానీ, ఈసారి ఆలస్యమైంది. కానీ ఈసారి పక్కాగా ముహూర్తం ఖరారు చేసింది కేంద్రం.ఆగస్టు మొదటి వారంలో పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆగస్టు 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేస్తారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది. రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారని పేర్కొంది. వచ్చే నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని పేర్కొంది. 'మీరు మెసేజ్ టోన్ విని మీ ఖాతాలోకి పీఎం కిసాన్ సమ్మాన్ పెట్టుబడి సాయం వచ్చిందని తెలుసుకుంటారు.' అని సోషల్ మీడియా ఎక్స్ వెదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్ ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖ ఓ పోస్ట్ చేసింది. కేవైసీ పూర్తి చేసిన వారికే డబ్బులు..అయితే, 20వ విడత నిధులు అందుకోవాలంటే ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది. నిధుల విడుదలకు ముందే ఇ-కేవైసీ పూర్తి చేస్తే సాయం అందుతుందని, పూర్తి చేయని వారికి నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే, ఇ-కేవైసీని 3 సులభమైన పద్ధతుల్లో పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు కేవైసీ పూర్తి చేశారు. మీరు కూడా చేశారా లేదా అనేది ఓసారి చెక్ చేసుకోండి.పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ()లోకి వెళ్లాలి.హోమ్ పేజీలో కనిపించే 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.మీ రాష్ట్రం, జిల్లా, మండలం వంటి వివరాలు ఇస్తే లిస్ట్ ఓపెన్ అవుతుంది. లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.అందుకు మీరు eKYC పూర్తి చేసి ఉండాలి.