ఇంగ్లాండ్ విజయానికి అడ్డుగోడలా నిలబడ్డ రాహుల్, గిల్‌.. కానీ..!

Wait 5 sec.

మాంచెస్టర్‌ టెస్ట్‌లో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 358 రన్స్‌కు ఆలౌట్ అయిన భారత్.. ఇంగ్లాండ్‌కు 669 రన్స్ ఇచ్చింది. దీంతో ఇంగ్లాండ్‌కు 311 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఇవాళే పూర్తవుతుందని అంతా భావించారు. భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పదని విశ్లేషించారు. కానీ ఈ సమయంలో , శుభ్‌మన్ గిల్‌ అదరగొట్టారు. అజేయ హాఫ్ సెంచరీలతో నాలుగో రోజు ఆటలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 62 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. 0/2తో పీకల్లోతు కష్టాల్లో భారత్..311 పరుగుల లోటుతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే తొలి ఓవర్‌లోనే క్రిస్ వోక్స్.. భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే 300లకు పైగా పరుగులు వెనకబడి ఉన్న భారత్.. నాలుగో రోజే ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుంటుందనే విశ్లేషణలు వచ్చాయి. రాహుల్, గిల్ మొండిపట్టు..తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు పడటంతో గిల్‌ కూడా ఓపెనర్‌గానే బరిలోకి దిగినట్లు అయింది. తొలి ఓవర్‌లో చివరి బంతిని అతడే ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్, .. మొండిగా బ్యాటింగ్ చేశారు. తొలుత గిల్ ఎదురుదాడికి దిగాడు. వేగంగా పరుగులు రాబట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం బౌలర్లకు విసుగుతెప్పించాడు. దీంతో రెండో సెషన్‌లో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. టీ తర్వాత ఇద్దరు బ్యాటర్లు వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంతోనే ఆడారు. రన్స్ కాస్త నెమ్మదిగా వచ్చినా.. ఇంగ్లాండ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లు ఆడి భారత్.. 174/2తో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87 రన్స్‌), శుభ్‌మన్ గిల్ (167 బంతుల్లో 78 రన్స్‌) ఉన్నారు. భారత్ ఇంకా.. 137 పరుగులు వెనకబడి ఉంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే భారత బ్యాటర్లు రేపు కనీసం రెండున్నర సెషన్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 రన్స్‌కి ఆలౌట్ అయింది.