దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కాంత'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దర్శక నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతోంది. దుల్కర్‌తో కలిసి హీరో రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం(జులై 28) దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. 1950ల మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో 'కాంత' సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ లో పోషించిన హీరో హీరోయిన్ పాత్రల్లోనే దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే కనిపిస్తున్నారు. దర్శక రచయిత పాత్రను సముద్రఖని పోషించారు. 'శాంత' అనే పేరుతో రూపొందిస్తున్న సినిమా విషయంలో డైరెక్టర్, హీరోకి మధ్య ఈగో క్లాష్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబరు 12న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.