: నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మ్యాజిక్ పని చేస్తుంది. ఇక్కడ వైవిధ్యం ఉంటుందని చెప్పొచ్చు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఇలా స్వల్పకాలం కాకుండా . అయితే ఇటీవల పరిస్థితి మారిపోయింది. షార్ట్ టర్మ్‌లో ఒకప్పటికి మించి నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌ కూడా స్టాక్స్‌నే కొనుగోలు చేస్తుంటాయి కాబట్టి ఇలా జరుగుతోంది. ఇక ఈటీ మ్యూచువల్ ఫండ్స్ అనలిసిస్ ప్రకారం.. గత ఏడాది వ్యవధిలో చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నష్టాల్నే ఎదుర్కొన్నాయి. ప్రతి రెండు పథకాల్లో ఒకటి నష్టాల్నే అందించింది. అంటే ఈ సమయంలో లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్లపై (ఒకేసారి పెట్టుబడి పెట్టడం) మొత్తం ఈక్విటీ ఫండ్స్‌లో దాదాపు 61 శాతం ప్రతికూల ఫలితాలే (నెగెటివ్ రిటర్న్స్) ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో 272 ఫండ్స్ ఉండగా.. 167 ఇన్వెస్టర్లకు నష్టాల్ని మిగిల్చాయి. కేవలం 104 పథకాలే లాభాలను అందించాయి. ఇక ఒకటేమో స్థిరంగా ఉంది. లాభం లేదు. నష్టం లేదు. ఇక వీటిల్లో దాదాపు 17 ఫండ్స్ ఏకంగా 10 శాతానికిపైగా నష్టాల్ని ఇచ్చాయి. వీటిల్లో అన్నింటికంటే ఎక్కువగా సామ్‌కో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏడాదిలో 17.48 శాతం నష్టం మిగిల్చింది. అంటే ఇందులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏడాదిలో రూ. 82,521 వచ్చింది. ఇక్కడ రూ. 17,500కుపైగా నష్టం వచ్చిందన్నమాట.10 శాతానికిపైగా నష్టాలు..ఇంకా 10 శాతానికిపైగా నష్టాలు మిగిల్చిన వాటిల్లో క్వాంట్ మల్టీ క్యాప్ ఫండ్, ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, శ్రీరామ్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, క్వాంట్ వాల్యూ ఫండ్, క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, సామ్‌కో ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, బరోడా బీఎన్పీ పారిబస్ వాల్యూ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, జేఎం వాల్యూ ఫండ్, క్వాంట్ ఫోకస్డ్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్ ఉన్నాయి. వీటన్నింటిలో లక్ష పెట్టుబడిపై రూ. 10 వేలకుపైగా నష్టం వచ్చింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ దాదాపు 8 శాతం నష్టాల్ని ఇచ్చింది. ఇక ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలే అందించాయి. స్మాల్ క్యాప్ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ వాల్యూ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వరుసగా 6.17 శాతం, 6.09 శాతం, 6.03 శాతం నష్టాల్ని ఇచ్చాయి. ఇక్కడ లక్ష పెట్టుబడిపై రూ. 6 వేలకుపైగా నష్టం వచ్చింది. ఎస్బీఐ కాంట్రా ఫండ్, ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వరుసగా 3.15 శాతం, 3.05 శాతం నష్టాలు అందించగా ఇక్కడ రూ. లక్షపై రూ. 3 వేలకుపైగా నష్టం వచ్చిందని చెప్పొచ్చు.ఈ స్కీంలో రూ. 21 వేలకుపైగా లాభం.. ఇక పాజిటివ్ రిటర్న్స్ అందించిన వాటిల్లో మోతీలాల్ ఓస్వాల్ మల్టీ క్యాప్ ఫండ్ టాప్‌లో ఉంది. ఇది ఏడాదిలో ఏకంగా 21.35 శాతం రిటర్న్స్ అందించింది. అంటే లక్ష పెట్టుబడిపై రూ. 21 వేలకుపైగా లాభం వచ్చింది. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ వరుసగా 12.15 శాతం, 11.58 శాతం రిటర్న్స్ అందించాయి. ఇక్కడ రూ. 12 వేలు, రూ. 11 వేలకుపైగా లాభాలు వచ్చాయన్నమాట. ఇక హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ 2.41 శాతం రిటర్న్స్ అందించగా లక్ష పెట్టుబడిపై ఏడాదిలో రూ. 2 వేలకుపైగా లాభం వచ్చింది.