యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. రద్దు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సోమవారం అర్థరాత్రి మరణశిక్ష రద్దు గురించి ప్రకటన వెలువడింది. దీని గురించి భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ ఆఫీసు అధికారిక ప్రకటన చేసింది. అయితే గురించి భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి కొన్ని గంటల్లో విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందిస్తుందని సమాచారం. నిమిష ప్రియ మరణశిక్ష రద్దు నిర్ణయం వెలువడటానికి ముందు యెమెన్‌ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఉత్తర యెమెన్‌ అధికారులతో పాటుగా అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. నిమిష ప్రియ ఉరి రద్దు కోసం భారత విదేశాంగ శాఖతో పాటుగా భారత గ్రాండ్‌ ముఫ్తీ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. ఆఖరి సాధనంగా ఉన్న . కానీ బాధిత తలాల్‌ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో నిమిష ప్రియకు మరణశిక్ష తప్పదు అనుకున్న తరుణంలో.. యెమెన్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేయడం విశేషం.ఇక నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్‌ హబీబ్‌ ఒమర్‌ బిన్‌ హఫీజ్‌ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. అయితే భారత గ్రాండ్‌ ముఫ్తీ విన్నపం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అలానే అబుబాకర్‌ ముస్లియార్‌.. నార్త్ యెమెన్‌ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. ఈ చర్యలు ఫలించడంతో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్‌ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం వెల్లడించింది. నిమిషప్రియ మరణశిక్ష రద్దు గురించి అబుబాకర్‌ చేసిన ప్రకటనను.. యెమెన్‌లోని యాక్షన్‌ కౌన్సిల్‌ ఫర్‌ తలాల్‌ మహదీస్‌ జస్టిస్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. మత పండితుల చొరవ వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.. నిమిష ప్రియ మరణశిక్ష రద్దు చేసిన యెమెన్ ప్రభుత్వం.. ఆమె విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా నిమిష ప్రియను జైలు నుంచి విడుదల చేస్తారా.. లేదా ఆమెకు జీవితఖైదు విధిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిమిష ప్రియ అంశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.యెమెన్ జాతీయుడి హత్యకేసులో నిమిష ప్రియకు ఐదు సంవత్సరాల క్రితం అనగా 2020లో మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి.. సమస్యను పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలంటూ భారత ప్రభుత్వం పలుమార్లు యెమెన్‌ ప్రభుత్వాన్ని కోరడం వల్ల.. జులై 16న అమలు కావాల్సిన నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కోసం యెమెన్‌ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది. తాజాగా ఆమె ఉరిశిక్ష రద్దు చేస్తూ నిర్ణయం వెలువడింది.