అన్నదాత సుఖీభవ పథకం.. ఆరోజే అకౌంట్‌లలో రూ.7వేలు జమ చేస్తారు.. ఇలా చెక్ చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు తీపికబురు.. కింద డబ్బులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 2న రైతులకు నిధులు రూ.7వేలు అకౌంట్‌లలో జమ చేస్తారు. పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత డబ్బులు ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేస్తారు. అయితే ఏపీ విషయానికి వస్తే 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.831.60 కోట్లు అందుతాయి. అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం సొమ్ము కూడా రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో వేస్తారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రూ.5 వేలు, పీఎం కిసాన్ నుంచి రూ.2 వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్రంలో 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు.. వీరిలో 46.20 లక్షల మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కౌలు రైతులకు కార్డుల జారీ పూర్తయ్యాక రెండు విడతల నిధులను కలిపి ఒకేసారి బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా 40 లక్షల మందికిపైగా రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేలు ఇస్తుంది. ఆ తర్వాత రెండు విడతల్లో మరో రూ.7 వేలు, రూ.6 వేలు ఇస్తాం. రైతులు డ్రోన్లను ఉపయోగించి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఎరువులను అక్రమంగా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 2న , పీఎం కిసాన్ పథకం కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తారు. వాస్తవానికి జూన్ నెలాఖరు, జులైలో ఫిక్స్ అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదాపడింది.. తాజాగా ఆగస్ట్ 2న రైతుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నట్లు తెలుస్తోంది.పీఎం కిసాన్ కింది కేంద్రం రూ.6 వేలను 3 విడతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కింద రూ.14 వేలను కలిపి మొత్తం రూ.20 వేలను రైతులకు అందజేస్తోంది. మొదటి విడతగా రూ.7వేలు అందజేస్తోంది. ఇప్పటికే రైతులకు సంబంధించిన అర్హత జాబితాలను సిద్ధం చేశారు. వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించి రైతులు తమ వివరాలను సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జాబితాలో పేరు లేనివారు, మరణించిన రైతుల వివరాలను మార్చుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం పన్నులు చెల్లించే వారిని అనర్హులుగా చూపిస్తే, ఆడిటర్ నుండి ధ్రువపత్రం తీసుకుని వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను కలవాలని తెలిపారు. పేరు నమోదైన రైతు చనిపోతే, ఆ పేరు మార్చకపోయినా పథకం వర్తించదన్నారు అధికారులు.అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. ఆధార్ నంబర్లకు బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ లేకపోవడంతో దాదాపు 6,900 కుటుంబాలు అనర్హులుగా గుర్తించబడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దాలని, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుల భూములకు సంబంధించిన వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి. తప్పులు సరిదిద్దితేనే రైతులకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి కలెక్టర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. 'రైతుల పట్టాదారు పాసుపుస్తకాలకు తప్పు ఆధార్‌ మ్యాప్‌ కావడం. ఒకే ఆధార్‌ నంబరును ఎక్కువమంది పట్టాదారులకు నమోదు చేయడం. రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు ఎక్కువ మొత్తం విస్తీర్ణం నమోదు కావడం. రీసర్వే గ్రామాల్లో ఒకే విస్తీర్ణం చాలామందికి నమోదవడం. పట్టాదారులకు ఆధార్‌నంబరు అనుసంధానం కాకపోవడం' వంటి కారణాలను ప్రస్తావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు 'రైతులు ప్రభుత్వ వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ స్టేటస్ ఆప్షన్‌ క్లిక్ చేయాలి. రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండా కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు ఆ రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో, లేదో కూడా తెలుస్తుంది' అంటున్నారు.