వివాదంలో టాలీవుడ్ కమెడియన్ రోలర్ రఘు.. టీడీపీ ఎమ్మెల్యేతో ఫోటో వైరల్ కావడంతో

Wait 5 sec.

టాలీవుడ్ కమెడియన్ రఘు వివాదంలో చిక్కుకున్నారు.. ఆయన ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వెళ్లారు.. అక్కడ స్థానిక టీడీపీను కలిశారు. ఇద్దరు కలిసి స్థానికంగా పర్యటించారు.. అనంతరం జరిగిన మడకశిర మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు. అయితే ఆయన తన వెంట రోలర్ రఘును కూడా సమావేశానికి తీసుకెళ్లారు. అక్కడ కౌన్సిల్ సమావేశంలో వేదికపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అధికారులతో పాటూ సినీ నటుడు రోలర్ రఘు కూడా కూర్చున్నారు. ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే అర్హులు.. కానీ బయట నుంచి వచ్చిన రోల్ రఘు అధికారిక కార్యక్రమానికి వెళ్లడం, ఏకంగా వేదికపై కూర్చోవడం చర్చనీయాంశమైంది. అయితే రోలర్ రఘుకు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు పరిచయాలు ఉన్నాయట.. అందుకే ఆయన మడకశిరకు వచ్చినట్లు తెలుస్తోంది. రోలర్ రఘు 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు.. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ, అనంతపురంతో పాటుగా పలుచోట్ల మీరో నారా రోహిత్‌తో కలిసి పలుచోట్లు ప్రచారం నిర్వహించారు. ఇటీవల మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మడకశిర మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, వైస్‌ ఛైర్మన్‌ రామచంద్రారెడ్డిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మే 17న ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించగా.. మొత్తం 20 మంది కౌన్సిలర్లలో 16మంది కౌన్సిర్లు హాజరయ్యారు. 15వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ కె.నరసింహరాజును ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా.. అలాగే నాలుగు వార్డు టీడీపీ కౌన్సిలర్‌ ప్రభావతిని వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అనంతరం వీరిద్దరు ప్రమాణం చేశారు. కొత్త మున్సిపల్ ఛైర్మన్ నరసింహరాజు భార్య రాధ 2018లో మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు.. మరోసారి ఆ కుటుంబానికి పదవి దక్కింది.