ITR Deadline: ఆదాయపు పన్ను విభాగం ఐటీఆర్ ఫామ్స్, వాటికి సంబంధించిన ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు కావాల్సిన ఫారాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే కోటిన్నర మందికిపైగా ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన చేసినట్లు సమాచారం. ఇంకా కోట్లలో రిటర్నులు ఫైల్ కానున్నాయి. అయితే ప్రతి సంవత్సరం జూలై 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. కానీ, ఈసారి కొత్త మార్పులు చేసిన క్రమంలో ఐటీ రిటర్నుల గడువును ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. అయితే మరి ఈ గడువు లోపు ఎవరు ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలి? ఆ గడువు దాటితే ఎలా? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. తమ అకౌంట్లు ఆడిట్ అవసరం లేని వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ఈ గడువు వర్తిస్తుంది. అలాగే బిజినెస్ చేసే వ్యక్తులు, వృత్తి నిపుణుల్లో ఆడిట్ అవసరమయితే వారికి అక్టోబర్ 31వ వరకు గడువు ఉంటుంది. ఆడిట్ అవసరం లేనివారంతా ఈసారి సెప్టెంబర్ 15 తేదీలోపే పూర్తి చేయాలి. అలాగే వివిధ రకాల మినహాయింపులు పొందేవారు, రాయితీపై ట్యాక్స్ కట్టేవారు కూడా ఈసారి సెప్టెంబర్ 15లోపే పూర్తి చేయాలి. సెప్టెంబర్ 15 గడువు కార్పొరేట్ అసెస్సీలు, ఆడిట్ అవసరమైనవారికి వర్తించదు. అలాగే ఆడిట్ చేయాల్సిన వ్యక్తి కంపెనీలో భాగస్వామి అయిన వారు, వారి జీవితభాగస్వాములకు సైతం సెక్షన్ 5ఏ కింద ఈ డెడ్‌లైన్ వర్తించదు. సెక్షన్ 92E కింద నివేది సమర్పించాల్సిన వ్యక్తులకూ ఈ గడువు నుంచి మినహాయింపు ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ కలిగి ఉండే వారికి నవంబర్ 30 వరకు అవకాశం ఉంటుంది. ఇక బిలెటెడ్ రిటర్న్స్, రివైజ్డ్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేవారికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది.గడువు దాటితే ఎలా?ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలి. ఒక వేళ గడువు దాటితే పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అలాంటి వారికి ముందుగా ట్యాక్స్ విభాగం నోటీసు అందిస్తుంది ఆ తర్వాత కూడా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా అయితే జూలై 31 గడువు ముగిశాఖ ఐటీఆర్ ఫైల్ చేస్తే గరిష్ఠంగా రూ.5 వేలు పెనాల్టీ పడుతుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే రూ.1000 జరిమానా పడుతుంది. ఆపైన ఆదాయం ఉంటే రూ.5000 వరకు పడుతుంది. సెక్షన్ 234 కింద చెల్లించాల్సిన పన్ను బకాయిలపై 1 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది.