పంత్ స్థానంలో భారత జట్టులోకి జగదీషన్.. కానీ ఆడేది మాత్రం అతడే..!

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో .. బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో అతడు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు దూరమ్యయాడు. ఈ విషయాన్ని అతడికి బ్యాకప్‌గా తమిళనాడుకు చెందిన ఎన్.జగదీషన్‌ను జట్టులోకి తీసుకుంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.పంత్ బ్యాకప్‌గా ఎంపికైన జగదీషన్ ఎవరు?29 ఏళ్ల జగదీషన్ తమిళనాడుకు చెందినవాడు. ఆ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 52 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అతడు.. సుమారు 50 సగటుతో 3373 రన్స్ స్కోరు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో అతడు 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో తమిళనాడు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 56.16 సగటుతో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 674 పరుగులు చేశాడు.అయితే టీమిండియా నుంచి పిలుపు వచ్చినప్పటికీ జగదీషన్ ఐదో టెస్టులో ఆడే అవకాశం కనిపించడం లేదు. జట్టులో ఉన్న మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. ప్లేయింగ్ లెవెన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. జురెల్ ఇప్పటికే టీమిండియా తరఫున నాలుగు టెస్టులో ఆడాడు. అందులో 40 సగటుతో 202 రన్స్ స్కోరు చేశాడు. అత్యధిక స్కోరు 90గా ఉంది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఐదో టెస్టుపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితమే సిరీస్‌ విజేతను తేల్చనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. జులై 31 నుంచి ఈ మ్యాచ్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది.శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్‌దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్షదీప్ సింగ్, ఎన్.జగదీషన్ (వికెట్ కీపర్).