ఏపీలో స్కూల్ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6వేలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అద్భుత అవకాశం కల్పించింది. రవాణా ఖర్చుల కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది.. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ ఏడాది దాదాపు 79,860 మంది విద్యార్థులకు మొత్తం రూ.47.91 కోట్లు రవాణా భత్యంగా చెల్లిస్తారు. పాఠశాల దూరం ఎక్కువగా ఉంటే ఈ డబ్బులు ఇస్తారు. ఎవరూ బడి దూరం అనే కారణంతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఏ) ఇస్తోంది. గతంలో డబ్బులు ఒకేసారి ఇచ్చేవారు.విద్యా హక్కు చట్టం ప్రకారం.. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు టీఏ () పొందే అవకాశం ఉంది. పిల్లలు ఉండే చోటు నుంచి ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ఉంటే డబ్బులు ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే కూడా డబ్బులు ఇస్తారు. సెకండరీ పాఠశాల ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే రవాణా భత్యం ఇస్తారు. ఒక్కో విద్యార్థికి నెలకి రూ.600 చొప్పున అందిస్తారు.. ఏడాదికి అయితే రూ.6 వేలు ఇస్తారు. ఈ డబ్బుల్ని విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి బస్సు లేదా ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్‌కు జమ చేస్తారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాదు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అర్హులైన విద్యార్థులను గుర్తించి.. వారి వివరాలను లీప్‌ యాప్‌లో నమోదు చేసింది. అనంతరం ఎంఈవోలు పరిశీలిస్తే సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ధృవీకరిస్తారు. ఆగస్టు 10 నాటికి లబ్ధిదారుల తుది జాబితాను అధికారులు ఖరారు చేస్తారు.. త్వరలోనే అర్హులైన విద్యార్థులకు టీఏ జమ చేస్తారు. ప్రతి ఏటా 10 నెలల పాటూ ఈ ట్రావెల్ అలవెన్స్ అందజేస్తారు. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.